CM చంద్రబాబు,DCM పవన్, మంత్రి లోకేశ్ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. DCM పవన్, మంత్రి లోకేశ్ అధికారిక పర్యటనలకు APACL నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి APACLకు రూ.54.63 కోట్ల బడ్జెట్ కేటాయించగా… తొలి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.30.95 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి.