loader

ఇషా జోడీకి రజతం

ఐఎస్‌స్ఎఫ్‌ వరల్డ్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్ లో ఇషా సింగ్‌ జంట, ఒలింపియన్‌ ఐశ్వరి ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ రజతాలు దక్కించుకొన్నారు. మంగళవారం జరిగిన 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ స్వర్ణ పోరులో ఇషా-సమ్రాట్‌ రాణా జంట 10-16తో చైనాకు చెందిన కియాంగ్జిన్‌ యో-కై హు చేతిలో పరాజయం పాలయ్యారు.చైనా షూటర్‌ యుకిన్‌ లియు స్వర్ణం, ఫ్రాన్స్‌ ప్లేయర్‌ రొమెయిన్‌ కాంస్యం సాధించారు. అయితే, క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 597 పాయింట్లు సాధించిన ఐశ్వరి ప్రపంచ […]

రికార్డు సృష్టించిన నోవాక్ జకోవిచ్

సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ టెన్నిస్ చరిత్రలో ఓ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. ఏథెన్స్‌లో జరిగిన హెల్లెనిక్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో లొరెంజో ముసెట్టిని ఓడించి తన కెరీర్‌లో 101వ ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇది జకోవిచ్ కెరీర్‌లో 72వ హార్డ్ కోర్ట్ టైటిల్ కావడం గమన్హారం. తాజాగా విజయంతో జకోవిచ్.. ఫెదరర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాక ప్రపంచంలోనే ఎక్కువ టైటిల్స్ తన ఖాతాలు వేసుకున్న తొలి ప్లేయర్ గా జకోవిచ్ రికార్డు సృష్టించాడు.

ఎమ్మెస్కే ప్రసాద్ వివాదం.. ఆ ఎంపీపై చంద్రబాబు సీరియస్..

ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రోటోకాల్ ఇచ్చే విషయంలో గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఘటనపై టీడీపీ ఎంపీ సానా సతీష్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఎయిర్‌పోర్టు అధికారులు శ్రీచరణి ఉన్న లాంజ్‌లోకి అనుమతించలేదు. ప్రొటోకాల్ పాటించాల్సిదేనని స్పష్టం చేశారు. ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోనందుకు సానా సతీష్‌పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

భారత్​లో 100ఏళ్ల హాకీ పండగ- 550 జిల్లాల్లో 1400పైగా పోటీలు

నేటితో భారత్​లో హాకీ ప్రయాణానికి సరిగ్గా 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ వేడుకలను హాకీ ఇండియా (HI) దేశవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసింది. దిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఉదయం 8:30 గంటల నుంచే ప్రధాన కార్యక్రమం మొదలైంది. ఇది దిల్లీకే పరిమితం కాదు, దేశంలోని 550కి పైగా జిల్లాల్లో ఏకకాలంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 1400లకు పైగా హాకీ మ్యాచ్‌లు నిర్వహించడం, అందులో 36,000 మందికి పైగా […]

శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానా

ప్రపంచకప్‌ సాధించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యురాలు రాష్ట్రానికి చెందిన శ్రీచరణికి విజయవాడలో ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్​తో పాటు క్రికెటర్‌ శ్రీచరణి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరల్డ్‌కప్‌ గెలిచిన క్రికెట్‌ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ప్రభుత్వం నజరానా ప్రకటించింది. శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగంతోపాటు రూ. 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే శ్రీచరణికి కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది.

శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌

ఉమెన్‌ వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యంలో ఆంధ్ర అమ్మాయి శ్రీచ‌ర‌ణి కీల‌క‌పాత్ర పోషించ‌టం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఎంతో గ‌ర్వ కార‌ణమని ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ అభిప్రాయపడ్డారు. ఆమెకు స్వాగతం పలికేందుకు అభిమానులు కూడా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వరల్డ్‌కప్‌లో విజయం సాధించిన జట్టులో ఉంటూ కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లోకి గ్రాండ్ వెల్క్ం లభించింది. ఆమె ప్రతిభను మెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

కోట్లాది మందికి మీరు ఆదర్శం.. దేశానికి గర్వకారణం

ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం ఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జట్టు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు చరిత్ర సృష్టించారు. ఈ విజయం భారత మహిళల శక్తికి ప్రతీక. మీరు యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు” అని పేర్కొన్నారు.

అహ్మదాబాద్‌లో ఫైనల్.. ప్రపంచ కప్ వేదికలు ఇవే..!

భారత్, శ్రీలంక  T20 World Cup 2026 టోర్నీకి  ఇరుదేశాల్లోని వేదికలు ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఎంపిక చేసింది. శ్రీలంక విషయానికొస్తే.. కొలంబో, క్యాండీ టోర్నీకి వేదిక కానున్నాయి. ఫిబ్రవరి 7న జరుగబోయే ఆరంభ పోరుకు వేదికైన అహ్మదాబాద్‌లోనే మార్చి 8న ఫైనల్ జరుగనుంది. అయితే.. బీసీసీఐ, పాక్ బోర్డు అంగీకరించినందున పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడించనున్నారు. ఒకవేళ పాక్ టీమ్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్‌లో […]

శ్రీ చరణికి షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ జాబితా ఇదే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్  రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపుల ఆధీనంలోని ఈ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ విజేతలైన జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మలను జట్టుతోను ఉంచుకుంది. అయితే, మరో ఛాంపియన్ ప్లేయర్ శ్రీ చరణికి షాక్ ఇస్తూ వేలంలోకి వదిలిపెట్టింది. రిటెన్షన్ జాబితాలో మారిజానే కాప్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్ లను కొనసాగించింది. ఈ ఐదుగురు గత మూడు సీజన్లలో ఢిల్లీ […]

ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టుకి ప్రధాని మోదీ ఘన సన్మానం..

మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధాని మోదీ బుధవారం సన్మానించారు. వరల్డ్ కప్ విశేషాలను టీమ్ఇండియా క్రీడాకారిణులు మోదీతో పంచుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మహిళల ప్రపంచ కప్ విజేత జట్టును ఆతిథ్యం ఇచ్చారు. ప్రధాన మంత్రి మహిళా క్రీడాకారిణులను ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశవ్యాప్తంగా యువతిలోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, వారు చదివిన పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను ప్రేరేపించాలని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON