మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస.. రెండు ఇండ్లు దహనం చేసిన ఆందోళనకారులు
ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని, లిటన్ ఏరియాలో ఆందోళనకారులు రెండు ఇండ్లను తగలబెట్టారు. స్థానికంగా ఉన్న సరీఖాంగ్ గ్రామంలో గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ హింసాత్మక ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు మోహరించి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఆందోళనలు ఆగడం లేదు.

