loader

ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ వైద్య సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వం రావాల్సిన బకాయిలు ఇంకా విడుదల కాలేదని ఆర్థిక భారం పెరిగిందని నెట్‌వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి దాదాపు 2700 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించాయి. వాటిని చెల్లించే వరకు సేవలు కొనసాగించలేమని ఓ ప్రకటన చేశాయి. గత రెండు రోజులుగా అనేక సందర్భాల్లో ఆందోళన చేశామని ప్రజాప్రతినిధులను కలిశామని అయినా రావాల్సిన బకాయిలపై స్పందన లేదని అన్నారు.

మరో రెండు దగ్గు మందులను బ్యాన్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం

పిల్లలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు దగ్గు మందులను రాష్ట్రంలో నిషేధించింది. ఇప్పటికే కోల్డ్‌ రిఫ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఔషధ నియంత్రణ విభాగం (డీసీఏ) ప్రకటించగా.. తాజాగా రిలీఫ్‌, రెస్పి ఫ్రెస్‌-TR సిరప్‌లపై నిషేధం విధించింది. ఈ రెండు సిరప్‌లలో కల్తీ జరిగిందని తేలడంతో వాటి విక్రయాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎయిడ్స్ నిరోధ‌క చ‌ర్య‌ల్లో ఏపీకి రెండో ర్యాంకు

ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి నిరోధ‌ చ‌ర్య‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP ఎయిడ్స్ నియంత్ర‌ణ సంస్థ‌కు రెండో ర్యాంకు ల‌భించింది. చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందిలో వైర‌ల్ లోడ్ త‌గ్గింది. రాష్టంలోని ఎఆర్‌టి సెంట‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంగా నిర్వ‌హించ‌డం, హెచ్ఐవి అనుమానితులకు ప‌రీక్ష‌లు చేసేందుకు ఉద్దేశించిన టార్గెట్‌డ్ ఇంట‌ర్వెష‌న్స్‌, లింక్ వ‌ర్క‌ర్స్ స్కీం విభాగాల్లో నూరు శాతం ప్రగ‌తిని సాధించింది. క‌మ్యూనిటీ ఆర్గ‌నైజేష‌న్లు, స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు( ఎన్జీఓలు), అవుట్ రీచ్ వ‌ర్క‌ర్ల ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏపీశాక్స్ […]

బ్రెస్ట్ క్యాన్సర్‌ చికిత్స కోసం అందుబాటులోకి సరికొత్త ఔషధం..!

భారతదేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటైన హెటిరో హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్  బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చింది. హెచ్‌‌‌‌ఈఆర్‌‌‌‌‌‌‌‌2-పాజిటివ్ రకం బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పెర్టుజుమాబ్‌ అనే ఔషధానికి‌‌‌ బయోసిమిలర్‌ అయిన‌‌‌‌‌‌‌ పెర్జియా (Perzea) ను అందుబాటులోకి తెచ్చింది. పెర్జియా 420 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.30 వేలుగా నిర్ణయించింది. పెర్టుజుమాబ్‌‌‌‌ను క్యాన్సర్ చికిత్సలో ట్రాస్టుజుమాబ్‌‌‌‌తో కలిపి వినియోగిస్తున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కీమోథెరపీల్లో ఈ కాంబినేషన్‌ కీలకంగా మారింది.

నేడు చివరి వన్డేలో పింక్ జెర్సీతో టీమిండియా మహిళల జట్టు

భారత మహిళా క్రికెట్ జట్టు మరో సారి సామాజిక చైతన్యానికి నాంది పలికే వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం లో శనివారం జరగబోయే ఆస్ట్రేలియాతో చివరి వన్డే  లో టీమిండియా మహిళల జట్టు పింక్ కలర్ జెర్సీతో క్రీడాభిమానుల ముందుకు రాబోతోంది. ఈ ప్రత్యేక జెర్సీ వెనుక ఉన్న కారణం మాత్రం క్రికెట్ కంటే పెద్దది – రొమ్ము క్యాన్సర్ అవగాహన. రొమ్ము క్యాన్సర్ సమస్యపై సమాజంలో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని […]

విజయవాడలో 115కి చేరిన డయేరియా కేసులు..

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 115 కేసులు న‌మోదైనాయి. వీరిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 61 మంది. చికిత్స తీసుకొని మరో 61 మంది డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. డయేరియా కారణంగా స్థానికులు కాచి చల్లార్చిన నీరే తాగాలని వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు మెడికల్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయి.

జనసేన పార్టీ ఎంపీకి షాక్.. ఏకంగా రూ.92 లక్షలు కొట్టేశారు

జనసేన ఎంపీ, టీ టైమ్ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.92.5 లక్షలు కొల్లగొట్టారు. ఎంపీ పేరుతో వాట్సాప్ ద్వారా టీ టైమ్ సీఎఫ్‌వో శ్రీనివాసరావును మోసగించారు. ఎంపీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టి డబ్బులు కావాలని మెసేజ్ చేయడంతో నమ్మి రూ.92.5 లక్షలు పంపారు. మోసం తెలుసుకుని సీఎఫ్‌వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మెదడును తినేసే అమీబా.. కేరళలో ఇప్పటికే నలుగురు మృతి!

కేరళలో ఒక నెలలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా ఐదవ మరణం నమోదైంది. కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మలప్పురం స్థానికుడు సోమవారం (సెప్టెంబర్ 8, 2025) మరణించాడు. ఆగస్టు 14 నుండి రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. ఇది ఐదవ మరణాన్ని సూచిస్తుంది. కోజికోడ్ MCHలో ప్రస్తుతం 11 మంది ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారని, వారిలో కనీసం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

నకిలీ దంత వైద్యుల పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్‌ వేణు యాదవ్‌

నకిలీ దంత వైద్యుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వేణు యాదవ్‌ కోరారు. కొందరు దంత వైద్యం చేయడానికి అర్హతలేని నకిలీ డాక్టర్స్‌ వైద్యం పేరిట నకిలీ ఇంప్లాంట్స్​‍, నాణ్యతలేని మెటీరియల్స్‌ వాడుతూ ప్రజలకు అనారోగ్యం కలిగించడం మా దృష్టికి వచ్చిందని, క్వాలిటీ ఇంప్లాంట్స్​‍, మెటీరియల్స్‌ వాడే వైద్యుల వద్ద మాత్రమే ట్రీట్‌మెంట్స్‌ పొందాలని తక్కువ ధరకు, ఉచిత చికిత్సకు ఆశపడి తమ సమయాన్ని ఆరోగ్యాన్ని […]

టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో మోసం.. మరో వ్యక్తి వీర్యంతో గర్భధారణ

సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై శనివారం నార్త్ జోన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ మహిళ తన భర్త వీర్యకణాలతో సంతానం పొందాలని ఆశించి ఈ కేంద్రాన్ని ఆశ్రయించగా, వైద్యులు మరో వ్యక్తి వీర్యంతో గర్భధారణ జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దంపతులకెంతో నిరీక్షణ అనంతరం ఓ మగ బిడ్డ పుట్టాడు. కానీ కొన్ని నెలలకే బాబు అనారోగ్యంతో బాధపడుతూ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో వారు అనుమానించారు. డీఎన్‌ఏ పరీక్ష చేయించగా, పిల్లవాడికి తండ్రి డీఎన్‌ఏ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON