loader

పశ్చిమబెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు

పశ్చిమ బెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఐసిఎంఆర్ లోని వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలో ఈ కేసులను నిన్న ( జనవరి 11) కనుగొన్నారు. జంతువుల నుంచి సంక్రమించే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతకం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ’(హెల్త్ ), లతో కేంద్ర హెల్త్ సెక్రటరీ పరిస్థితిని సమీక్షించారు. వేగంగా నివారణ చర్యలు చేపట్టడంలో సమన్వయం వహిస్తామని భరోసా ఇచ్చారు. […]

తల్లిదండ్రులకు నెస్లే తీవ్ర హెచ్చరిక.. ఆ మిల్క్ పౌడర్లు అస్సలే వాడొద్దంటూ రీకాల్!

పసి పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లులకు నెస్లే సంస్థ ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నమ్మే నెస్లే బేబీ ఫుడ్ బ్రాండ్లయిన SMA, NAN, BEBA ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన ‘సిర్యూలైడ్’ టాక్సిన్ ఉన్నట్లు.. తాము గుర్తించామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు బ్యాచ్‌లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ రీకాల్‌ను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

మెడికల్‌ షాపులపై డీసీఏ దాడులు.. షోకాజ్‌ నోటీసులు

నిబంధనలకు విరుద్ధంగా హ్యాబిట్‌ ఫార్మింగ్‌ డ్రగ్స్‌ విక్రయిస్తున్న పలు మెడికల్‌ షాపులపై డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కొడైన్‌ కలిగి ఉన్న దగ్గుమందు, నైట్రావె ట్‌, అల్ఫ్రాజోలం, ట్రమడోల్‌, జోల్పిడెమ్‌, టైడల్‌ మాత్రలు, మెఫెన్‌టర్మైన్‌, అట్రాక్యూరియమ్‌ బెసిలెట్‌ ఇంజెక్షన్లను విచ్ఛలవిడిగా అమ్ముతున్నట్టు డీసీఏ అధికారులు ఈ సోదా ల్లో గుర్తించారు. 63 మెడికల్‌ షాపులకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

చిన్న గాటుతోనే ఫ్రీగా గుండె ఆపరేషన్.. చరిత్ర సృష్టించిన SMSIMSR

కోల్‌కతాలోని మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ సర్దార్ బృందంతో కలిసి శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(SMSIMSR) బృందం 29 ఏళ్ల యువతికి టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. దీని ఫలితంగా గాయం పరిమాణం 2 సెం.మీ. కన్నా తక్కువగా ఉండి, రోగి వేగంగా కోలుకొని 72 గంటలలోనే డిశ్చార్జ్‌ అయ్యింది.ప్రపంచంలోనే దీన్ని ఉచితంగా, భారతదేశంలో టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని నిర్వహించిన […]

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 30 శాతం పెరిగిన రోగులు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో పెరిగిపోతుండడంతో శ్వాసకోశ వ్యాధుల రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. రోజువారీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కన్నా 20 నుంచి 30 శాతం ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల రోగుల సంఖ్య ఉంటోందని డాక్టర్లు చెప్పారు. జలుబు, దగ్గు, ఊపిరాడకపోవడం, ఛాతీ బిగుసుకుపోవడం, తదితర లక్షణాలతో రోగులు వస్తున్నారని తెలిపారు. కాలుష్యం ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల నుంచే రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారని డాక్టర్లు తెలిపారు.

నాలుగేళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ వైరస్

గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి మూడు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేశారు. రిపోర్టులో పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్, ఎలీసా టెస్ట్‌లో కూడా పాజిటివ్ వచ్చిందని గజపతినగరం ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి ప్రవీణ్ చెప్పారు. దీంతో మరువాడ గ్రామంలో అధికారులు క్లోరినేషన్‌ను చేపట్టారు.

స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో.. మహిళ మృతి

విజయనగరంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ చనిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జ్వరంతో పాటు శరీరంలో నల్లటి చుక్కలాంటి గాయం, తీవ్రమైన అలసట, వణుకులు, శ్వాసకోస ఇబ్బందులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట టైఫాయిడ్ గా గుర్తించి చికిత్స అందించారు వైద్యులు. చివరికి ఆయాసం పెరిగి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు లోతైన పరీక్షలు చేయగా ఫైనల్ గా స్క్రైబ్ టైఫిస్ లక్షణాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా […]

న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి..

ఫార్మాసూటిల్ కంపెనీ బయలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ మరో ముందడుగు వేసింది. ఆ కంపెనీ ఇటీవల తయారు చేసిన 14 వలెంట్ న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ముందస్తు అర్హత (ప్రీ-క్వాలిఫికేషన్) స్టేటస్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ 14 రకాల స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియా నుంచి రక్షణనిస్తుంది. ఆరువారాల వయసున్న శిశువుల్లో న్యూమోనియా, మెనింజైటిస్‌తో పాటు సెప్సిస్‌ వంటి వ్యాధులను PNEUBEVAX 14 నయం చేయగలదు.

క్యాన్సర్ అవగాహన దినోత్సవం

క్యాన్సర్ నివారణ, ముందుగానే గుర్తించడం, చికిత్స మరియు దాని సంబంధిత సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం. భారతదేశంలో నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. ఈ రోజులు క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, నివారణ, ముందస్తు గుర్తింపు మరియు చికిత్స ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఉద్దేశించబడ్డాయి

పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళనలు – నెట్వర్క్ ఆసుపత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం బకాయిల వివాదం మళ్లీ ముదురుతోంది. ప్రభుత్వం ఇటీవలే రూ.250 కోట్లు విడుదల చేసినప్పటికీ, నెట్వర్క్ ఆసుపత్రులు తమ ఆందోళనను ఉపసంహరించుకోకుండా కొనసాగించాలని నిర్ణయించాయి. ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటనలో, తాము డిమాండ్ చేస్తున్న మొత్తం రూ.2,700 కోట్ల బకాయిలు పూర్తిగా చెల్లించకపోతే, సేవలు పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పరిష్కారమవకపోతే ప్రజల ఆరోగ్య హక్కులే ప్రమాదంలో పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON