loader

HPV Vaccine :తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను బాల్య దశలోనే అడ్డుకోవడానికి హెచ్‌పీవీ వ్యాక్సినేన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయి. ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. టీకా వేయించుకునే పిల్లలు కచ్చితంగా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని అన్నారు. ఖాళీ కడుపుతో రావద్దని సూచించారు. టీకా వేసుకున్న ఒక అరగంట పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. టీకా వేసిన చోట కొంచెం నొప్పి ఉంటుందని, జ్వరం కూడా రావచ్చని చెప్పారు. అలర్జీలు ఉన్నా, అనారోగ్యంతో […]

ఖరీదైన IVF గాంధీ ఆస్పత్రిలో ఉచితం.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

పేదలకు వరంగా గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా ప్రారంభించారు. గాంధీ వైద్యులు అద్భుతం సృష్టించారు. ఐవీఎఫ్ చికిత్సను అందించి.. ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో ఐవీఎఫ్ చికిత్స కోసం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేస్తుండగా.. గాంధీ ఆసుపత్రిలో మాత్రం ఉచితంగా చికిత్స అందించి మహిళ గర్భం దాల్చేలా చేశారు. తాజాగా గాందీ డాక్టర్ల బృందం విజయవంతంగా […]

శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా.. సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రీకాకుళంలో కొందరు డయేరియా బారినపడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 32 మంది డయేరియాకు గురయ్యారని ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులు వెల్లడించారు. వారిలో 10 మంది ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు. మరో 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సీఎంకు వివరించారు.

క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించాలి: చిరంజీవి

శరీరం చెప్పే మాట అందరూ వినడంతో పాటు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్య ఉండకూడదని నటుడు చిరంజీవి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరు ప్రసంగించారు. శరీరంలో వచ్చే మార్పులు గమనించడంతో క్యాన్సర్ ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే ఆ వ్యాధిని జయించగలుగుతామని తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం తాను షార్ట్ ఫిల్మ్‌లు తీయడానికి సిద్ధంగా ఉన్నానని చిరు తెలిపారు.

క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం చేసేందుకు అందరూ ముందుకు రావాలి : మంత్రి సత్యకుమార్

ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న కేసులు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాథమిక పరీక్షలు, గుర్తించిన అంశాలు, తీసుకోబోతున్న చర్యలను మంత్రి సత్యకుమార్ వివరించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల నియంత్రణ, వైద్యసేవలు మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.  ప్రాథమిక పరిశీలన ద్వారా క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలోనే అరికట్టవచ్చునని పేర్కొన్నారు.  2024-25 ఆర్ధిక సంవత్సరంలో 675.66 కోట్లను క్యాన్సర్ పీడితులకు వైద్యాన్ని […]

పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్ కలకలం.. ఎయిర్‌పోర్ట్‌లలో స్క్రీనింగ్ ప్రారంభం

పశ్చిమ బెంగాల్​లో నిఫా వైరస్ (Nipah Virus) కేసుల కలకలంతో.. కొత్త కేసుల నిర్ధారణతో పాటు క్వారంటైన్ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ వైరస్ వ్యాప్తితో పశ్చిమ బెంగాల్​ నుంచి విమానాలు వచ్చే విమానాశ్రయాల్లో అధికారులు స్క్రీనింగ్స్ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి పశ్చిమ బెంగాల్​లో నిఫా వైరస్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. దీనిలో భాగంగానే ఎయిర్​పోర్ట్స్​లో స్క్రీనింగ్ చేస్తున్నారు.నిఫా వైరస్ అనేది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ఒక జూనోటిక్ అనారోగ్యం.

పశ్చిమబెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు

పశ్చిమ బెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఐసిఎంఆర్ లోని వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలో ఈ కేసులను నిన్న ( జనవరి 11) కనుగొన్నారు. జంతువుల నుంచి సంక్రమించే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతకం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ’(హెల్త్ ), లతో కేంద్ర హెల్త్ సెక్రటరీ పరిస్థితిని సమీక్షించారు. వేగంగా నివారణ చర్యలు చేపట్టడంలో సమన్వయం వహిస్తామని భరోసా ఇచ్చారు. […]

తల్లిదండ్రులకు నెస్లే తీవ్ర హెచ్చరిక.. ఆ మిల్క్ పౌడర్లు అస్సలే వాడొద్దంటూ రీకాల్!

పసి పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లులకు నెస్లే సంస్థ ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నమ్మే నెస్లే బేబీ ఫుడ్ బ్రాండ్లయిన SMA, NAN, BEBA ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన ‘సిర్యూలైడ్’ టాక్సిన్ ఉన్నట్లు.. తాము గుర్తించామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు బ్యాచ్‌లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ రీకాల్‌ను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

మెడికల్‌ షాపులపై డీసీఏ దాడులు.. షోకాజ్‌ నోటీసులు

నిబంధనలకు విరుద్ధంగా హ్యాబిట్‌ ఫార్మింగ్‌ డ్రగ్స్‌ విక్రయిస్తున్న పలు మెడికల్‌ షాపులపై డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కొడైన్‌ కలిగి ఉన్న దగ్గుమందు, నైట్రావె ట్‌, అల్ఫ్రాజోలం, ట్రమడోల్‌, జోల్పిడెమ్‌, టైడల్‌ మాత్రలు, మెఫెన్‌టర్మైన్‌, అట్రాక్యూరియమ్‌ బెసిలెట్‌ ఇంజెక్షన్లను విచ్ఛలవిడిగా అమ్ముతున్నట్టు డీసీఏ అధికారులు ఈ సోదా ల్లో గుర్తించారు. 63 మెడికల్‌ షాపులకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

చిన్న గాటుతోనే ఫ్రీగా గుండె ఆపరేషన్.. చరిత్ర సృష్టించిన SMSIMSR

కోల్‌కతాలోని మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ సర్దార్ బృందంతో కలిసి శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(SMSIMSR) బృందం 29 ఏళ్ల యువతికి టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. దీని ఫలితంగా గాయం పరిమాణం 2 సెం.మీ. కన్నా తక్కువగా ఉండి, రోగి వేగంగా కోలుకొని 72 గంటలలోనే డిశ్చార్జ్‌ అయ్యింది.ప్రపంచంలోనే దీన్ని ఉచితంగా, భారతదేశంలో టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని నిర్వహించిన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON