పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ (Nipah Virus) కేసుల కలకలంతో.. కొత్త కేసుల నిర్ధారణతో పాటు క్వారంటైన్ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ వైరస్ వ్యాప్తితో పశ్చిమ బెంగాల్ నుంచి విమానాలు వచ్చే విమానాశ్రయాల్లో అధికారులు స్క్రీనింగ్స్ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. దీనిలో భాగంగానే ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ చేస్తున్నారు.నిఫా వైరస్ అనేది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ఒక జూనోటిక్ అనారోగ్యం.

