ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం దక్కించుకున్న ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ చట్టసభ ‘నెస్సెట్’లో చారిత్రాత్మక ప్రసంగం చేసిన మోదీకి.. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒహానా ‘స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్’ను ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చూపిన అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఈ అత్యున్నత పతకాన్ని అందజేశారు.

