loader

అవుట్ స్టాండింగ్ మాస్ ఇన్నింగ్: 49 బంతుల్లో టీమిండియా లేడీ బాస్ సెంచరీ

భారత తుఫాన్ ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి రికార్డుల మోత మోగించింది.  ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెంచరీ బాదిన మొదటి మహిళా క్రికెటర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది. 9 సిక్సర్లు బాదడం ద్వారా షెఫాలీ వర్మ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో  t20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 104 సిక్సర్లు పూర్తి చేసుకుని, భారత్ తరఫున  అత్యధిక సిక్సర్లు బాదిన మహిళా […]

మోడీపై రాహుల్ ‘మై ఫ్రాండ్ ‘ స్కిట్ వైరల్..! చీప్, వల్గర్ అంటూ బీజేపీ ఫైర్..!

ఇండోర్ ఈవెంట్ లో స్టాండ్-అప్ కమెడియన్ మణి.. విదేశీ నాయకులతో ప్రధాని మోదీ మాట్లాడే  సుపరిచితమైన సంభాషణా శైలిని అతిశయోక్తిగా ప్రదర్శిస్తూ, పదేపదే “మై ఫ్రెండ్” అనే పదాన్ని వాడారు. రాహుల్ గాంధీ “మీరు ఎలా ఉన్నారు, మోదీ జీ?” అని బదులిచ్చారు.   అప్పుడు మణి, “గ్రేట్ హెరాస్మెంట్” అని అన్నారు,  ఈ స్కిట్‌ను చౌకబారు, అసభ్యకరమైన ట్రోల్స్ చేసిన బూతు చేష్టలుగా బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ అభివర్ణించారు. ఏ మంచి వ్యక్తి కూడా […]

బంగ్లాపై ఘన విజయం.. ఫైనల్ చేరిన భారత్..

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ పోరుకు అర్హత సాధించింది   బంగ్లాదేశ్ మహిళల జట్టుతో జరిగిన కీలకమైన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు   20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును సాధించింది. బంగ్లాదేశ్ జట్టు భారత బౌలర్ల కట్టుదిట్టమైన దాడిని ఎదుర్కొలేకపోయింది.  పదిహేను ఓవర్ల నాలుగు బంతుల్లోనే కేవలం 71 పరుగులు మాత్రమే చేసి […]

మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్న బాలికలకు మధ్యాహ్నం భోజనం అనంతరం కడుపు నొప్పి రావడంతో గమనించిన  స్కూల్ సిబ్బంది స్థానిక హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. నొప్పి తీవ్రంగా ఉన్నవారిని  మరో15 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం సన్నిహితుడు గెస్ట్‌ హౌస్‌కు రమ్మన్నాడు.. మహిళా వ్యాపారవేత్త ఆవేదన

ఓ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌ ఏకంగా సీఎం సన్నిహితుడి నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించి తన ఎక్స్‌ ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం తాను న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొంది.

వంతెనపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు.. ముగ్గురి మృతి

మితిమీరిన వేగంతో ప్రయాణిస్తోన్న ఓ విలాసవంతమైన కారు వంతెనపై నుంచి పడి ముగ్గురు మృతి చెందిన ఘటన ముంబయిలో చోటు చేసుకొంది. ముంబయిలోని కోస్టల్ రోడ్ బ్రిడ్జ్ పై ఆదివారం తెల్లవారుజామున మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీకి వెళ్తేన్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పింది. దీంతో వంతెన పైనుంచి పడిపోయింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. అందులో ప్రయాణిస్తోన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరిని షన్యా గజ్జల్ (21)గా గుర్తించారు. ఇదే ఘటనలో మరోకరు తీవ్రంగా […]

చంద్రబాబు ఆదేశాలూ బేఖాతర్ ? ఈసారి రెవెన్యూ మంత్రికి షాక్..!

రాష్ట్రంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు  ప్రధాని,సీఎంతో పాటు సంబంధిత శాఖల మంత్రుల ఫొటోల్ని ప్రోటోకాల్ ప్రకారం ప్రకటనలపై ముద్రించాలి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగితే ఊరుకునేది లేదంటూ మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. కానీ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం ఇచ్చిన యాడ్ లో రెవెన్యూ మంత్రి అనగాని  సత్యప్రసాద్ ఫొటో లేదు. దీంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. అయితే ఈసారి చంద్రబాబు ఆదేశాల్నీ పట్టించుకోరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఎంజీఎం దవాఖానలో పైకప్పు పెచ్చులు ఊడి రోగులకు గాయాలు

వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55), అటెండర్స్ ఎల్లమ్మ (50), ఓంకార్ (33) కు గాయాలయ్యాయి. బాధితులు జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం ఉప్పుగల్లుకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యూకేలో భార‌త సంత‌తి వ్య‌క్తిపై యెమెన్ జాతీయుడి దాడి..!

UK లో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్‌పై అమానుష దాడి జరిగింది. 33 ఏళ్ల యెమెన్  జాతీయుడు సిక్కు డ్రైవర్‌పై దాడిచేసి అతని బస్సును దొంగిలించాడు. ఆ బ‌స్సును రాంగ్ రూట్‌లో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం టెల్ఫోర్డ్‌లోని మేడ్లీ ప్రాంతంలో ఉన్న కోర్ట్ స్ట్రీట్‌లో చోటుచేసుకుంది. అలీ బల్హాద్ అనే యెమెన్ జాతీయుడు సిక్కు డ్రైవర్ గడ్డాన్ని పట్టుకుని లాగడం, అతని తలతో డ్రైవర్ తలను బలంగా బాదడం స్పష్టంగా కనిపిస్తోంది

వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..

ఏయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ ఇలావేనిల్ వలరివన్ డబుల్ ధమాకా సాధించింది. అటు వ్యక్తిగత సిల్వర్ తోపాటు, ఇటు టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఇలవేనిల్ 633.5 స్కోరు సాధించింది. ఇక వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ సిల్వర్ మెడల్ సాధించింది. జపాన్ కు చెందిన తైచి హినాటకు గోల్డ్, సౌత్ కొరియాకు చెందిన బాన్ హయోజిన్ కు కాంస్యం దక్కింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON