నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న బాలికలకు మధ్యాహ్నం భోజనం అనంతరం కడుపు నొప్పి రావడంతో గమనించిన స్కూల్ సిబ్బంది స్థానిక హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. నొప్పి తీవ్రంగా ఉన్నవారిని మరో15 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం జిల్లా హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.