loader

ఏకపక్ష సుంకాలపై బ్రిక్స్ దేశాల ఆందోళన.. దిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం

దిల్లీ డిక్లరేషన్ ను బ్రిక్స్ దేశాలు ఆమోదించాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువరించారు. విభేదాలు పక్కన పెట్టి ఇరాన్ సహా యూఏఈ, సౌదీ అరేబియా ఈ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష సుంకాల విధింపుపై BRICS దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన ఏకపక్ష నిర్బంధ చర్యలను ఖండించాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి […]

అజితను కలిసిన సీఎం విజయ్.. ఫొటోలు వైరల్

సినీ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటుడు అజిత్ ను యూకేలో కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సీఎం విజయ్ యూకేలో పర్యటిస్తున్నారు. సరదాగా రేసింగ్ ఈవెంట్ కు వెళ్లిన సీఎం విజయ్.. అజిత్ ను చూడగానే సినిమా స్టైల్లో నడుచుకుంటూ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సరిహద్దులో శాంతి.. వాణిజ్యంలో దోస్తీ! – కుదిరిన కీలక డీల్..!

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్‌–చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య, శాంతి-స్థిరత్వం, వాణిజ్యం, సరఫరా గొలుసులు, మార్కెట్‌ ప్రాప్యతతో పాటు ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్‌పై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుదిరిన సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలకు ఇరు దేశాలు కట్టుబడి ఉండాల్సిన […]

BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం

న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన 18వ BRICS శిఖరాగ్ర సదస్సు తొలిరోజే ఒక చారిత్రక అద్భుత దృశ్యానికి వేదికైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఎంతో ఆప్యాయంగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. అంతర్జాతీయ రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఈ అరుదైన ఫొటోను ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఇది ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో తీవ్ర నష్టం – జిన్పింగ్

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అక్కడ నివసిస్తున్న సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిక్స్ (BRICS) వర్చువల్/వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి చైనా క్రియాశీలకంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో సభ్య దేశాలన్నీ చరిత్రలో ఎల్లప్పుడూ సత్యం, న్యాయం వైపు మాత్రమే నిలబడాలని కోరారు.

ధరణిలో 23 వేల ఎకరాల అక్రమాలు..: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో నెలకున్న భూ సమస్యలు, 22ఏ నిబంధనలు , ధరణి అక్రమాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్‌ కుటుంబం, వాళ్ల బంధువులు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. అలాగే ధరణి తప్పిదాలతో వందల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణలోని దాదాపు 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని మంత్రి మండిపడ్డారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక […]

జో రూట్ ‘ది అన్‌స్టాపబుల్’.. సచిన్ ప్రపంచరికార్డును అధిగమించాడు..

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక అర్థశతకాలు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని రూట్ అధిగమించాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు. జో రూట్ – 69*, సచిన్ – 68, ఎస్ చందర్‌పాల్ – 66, అలెన్ బోర్డర్ – 63

బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర దృశ్యం.. అన్ని దేశాల అగ్రనేతలు కలిసి..

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ మండపం బయట ఉన్న ఆవరణలో బ్రిక్స్ దేశాల నేతలు కలిసి ఒకేసారి మొక్కలు నాటారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పలువురు బ్రిక్స్ దేశాల అగ్ర నేతలు వరుసగా నిలబడి ఒకేసారి మొక్కలు నాటి నీలు పోసిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

క్యూర్ బిల్లుకు శాసనమండలి ఆమోదం

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్-2026 బిల్లుకు (CURE Bill) శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. మొత్తం 6 రోజుల 19 గంటల 20 నిమిషాలు సభ నడించింది.  కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా మొత్తం నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.  హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ఒకే నగరం, ఒకే పరిపాలన, ఒకే చట్టం నినాదంతో క్యూర్ – 2026 బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఆవరణలోని శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు గణేశ్ మండపాల నిర్వాహకులు కూడా పోలీస్, అధికారులకు సహకరించాలని కోరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON