పోలీసులు దాడి చేసిన తీరును గవర్నర్కు వివరించాం : కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులు దాడి చేసిన తీరును, తెలంగాణలో పరిస్థితులను గవర్నర్కు వివరించామన్నారు. శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిపై పురుష పోలీసుల దాడి వీడియోలను చూపించాం. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను తెలిపామన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగి దుశ్వాసనపర్వం ఎలా సృష్టించారో చెప్పామన్నారు. కేసీఆర్ చావు కోరుతూ ఎలా మాట్లాడారో గవర్నర్కు చెప్పామన్నారు.

