loader

భాషను మార్చుకో..నోటిని అదుపులో పెట్టుకో : రేవంత్‌కు తలసాని హెచ్చరిక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, నోటిని అదుపులో పెట్టుకోవాలని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ సభలో అధికారిక కార్యక్రమం అనే సోయి లేకుండా వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల ముందు ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ లు చేస్తున్నారని ఆరోపించారు. సనత్ నగర్ టిమ్స్‌ను కట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం అవివేకమని విమర్శించారు.

సదరన్‌ కౌన్సిల్‌ భేటీ.. హాజరైన సీఎంలు చంద్రబాబు, విజయ్‌

కేంద్రహోంమంత్రి అమిత్ ఆధ్వర్యంలో తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో దక్షిణ మండలి (సదరన్ కౌన్సిల్) సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మిగిలిన ముఖ్యమంత్రులు కలుసుకున్నారు.

‘కల్యాణలక్షి, షాదీముబారక్’పై స్టే ఎత్తివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కల్యాణలక్షి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టే విధించిన పధకాలపై తెలంగాణ ప్రభుత్వం స్టే ఎత్తివేయాలని కోరుతూ న్యాయస్థానానికి విన్నపం చేసింది. హైకోర్టు ఉచిత పథకాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జీతాలు, పెన్షన్లు రాక అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్టేను తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థితికి చేరుకుందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగంలోని సంస్థలను లాభాల్లోకి […]

అందుకే సీబీఐ విచారణ చేయాలి వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని జగన్ ప్రశ్నించారు. ఆయనికి ఉద్యోగం ఇవ్వకుండా, ఆయన లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారని నిలదీశారు. అంతేకాకుండా ఆ వ్యక్తి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌కు రాలేదని బుకాయిస్తున్నారని అన్నారు. లీకేజీ ఆయనతోనే ఆగిపోయిందా ఆయన ద్వారా ఇంకా ఎవరికైనా చేరిందా అనేది తేలాలని డిమాండ్ చేశారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?” […]

చీనాబ్ బ్రిడ్జిపై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్‌

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఖ్యాతిగాంచిన చీనాబ్ రైల్ బ్రిడ్జిపై వందే భారత్ రైలు సరికొత్త మైలురాయిని అధిగమించింది. తొలిసారిగా ఈ బ్రిడ్జిపై రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కత్రా-బనిహాల్ రైలు మార్గంలో గరిష్ఠ వేగ పరిమితిని 100 కిలోమీటర్లకు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వేగంతో రైలు విజయవంతంగా నడిచింది. జమ్మూ-కశ్మీర్‌లోని చీనాబ్ రైల్ బ్రిడ్జి నదీ మట్టానికి ఏకంగా 359 మీటర్లు (1,178 అడుగులు) […]

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది: వైఎస్‌ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన మెగా డీఎస్సీ 2025లో అనేక అక్రమాలు జరిగాయని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి ఆరోపించారు “డీఎస్సీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నల తయారీ అనేది SCERT డైరెక్టర్‌ బాధ్యత, డీఎస్సీ పరీక్షను నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌ది. ఈ రెండూ, ఒకే వ్యక్తికి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచారు. డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది అని అన్నారు.

అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే – అదితి శంకర్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన మాజీ ప్రియుడి వల్ల తాను చాలా కోల్పోయానని… వాఖ్యలపై అదితి శర్మ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘అనుపమ ఇంటర్వ్యూ చూశా. ఆమె కామెంట్స్‌పై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. కానీ, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందిని ధైర్యంగా పంచుకున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆమె మాటల్లో నిజాయితీ ఉంది. ఎవరినీ నిందించడం అనుపమ ఉద్దేశం కాదు. ఆమె పంచుకున్న అనుభవం అవగాహన కలిగించేలా ఉంది. అనుపమలా ఓపెన్‌గా మాట్లాడడం వల్ల అలాంటి వారికి ఓ స్పష్టత […]

లోకేష్ రాజీనామా చేయాల్సిందే: జగన్ సంచలన వ్యాఖ్యలు

తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎవరికైనా స్పష్టత వస్తుందని జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో నారా లోకేష్ వ్యవహారశైలిని ఉద్దేశిస్తూ ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందనే విషయం అందరికీ అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తప్పులను అంగీకరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని […]

ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు – రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!

తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో HMDA అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను 22A జాబితాలో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీలో ఆగని జూనియర్ డాక్టర్ల సమ్మె

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల (JUDA) ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసనలు, సమ్మె గురువారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన స్టైపెండ్ పెంపును జూడాల సంఘం ముక్తకంఠంతో తిరస్కరించింది. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON