loader

శ్రీకాళహస్తిలో పట్టపగలే రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. కానిస్టేబుల్‌పై దాడి

ఏపీలో గత కొద్దిరోజులుగా అల్లరి మూకలు, గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి.ధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో వన్ టౌన్ కానిస్టేబుల్ పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ పైనే దాడి చేయడంతోపాటు, కత్తులతో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ చర్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

తమిళనాడు నుంచే పీఎం.. సౌత్ కలిస్తే ప్రధాని మనమే

దేశ రాజకీయాల్లో మళ్లీ ‘ఉత్తరాది వర్సెస్ దక్షిణాది’ సెగలు తీవ్రస్థాయికి చేరాయి. నియోజకవర్గాల విభజనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడిన మంత్రి ఆధవ్ అర్జున్, ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు కాదని, తమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడుకునే హక్కుల పోరాటమని స్పష్టం చేశారు.గతంలో మూపనార్ వంటి నాయకులకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో దక్షిణాది నుంచి, ముఖ్యంగా తమిళనాడు నేల నుంచే దేశ ప్రధాని రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

అన్నింటికీ సమాధానం ఇస్తానన్న అమిత్‌ షా.. భయం లేదన్న రాహుల్‌ గాంధీ

అమిత్‌ షా ప్రతిపాదనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ఆయనతో చర్చించడానికి మాకేం భయం లేదని అన్నారు. ఆయన చెప్పే ఉపన్యాసాలు వినడానికి ప్రతిపక్షానికి ఆసక్తి లేదని, విద్యార్థులపై కాల్పులు ఎవరు జరిపారు. మేకులు ఉన్న లాఠీలతో ఎవరు కొట్టించారు అని రాహుల్‌ ప్రశ్నించారు. వీటిపై సమాధానాలు చెప్పేందుకు 20 రోజులుగా అమిత్‌ షా కనిపించకుండా పోయారని, సమాధానం చెప్పే ధైర్యం లేక సభకు రావడం లేదని అన్నారు. ఏ విషయంలోనూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాహుల్‌ […]

FCRA బిల్లును జేపీసీకి పంపాలని లోక్ సభ తీర్మానం

విదేశీ నిధుల నియంత్రణ చట్టం సవరణ (FCRA) బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని లోక్ సభ తీర్మానం చేసింది. ఈ మేరకు బిల్లుపై 31 మంది సభ్యులతో జేపీసీని కేంద్రం ఏర్పాటు చేసింది. జేపీసీలో 21 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల వరకు గడువు విధించింది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లును […]

ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ చెల్లదు.. షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ (FRC) చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను SIRలో ఓటర్ల ధ్రువీకరణ, పరిశీలన కోసం ఆమోదించలేమని వెల్లడించింది.ముందస్తు క్షేత్రస్థాయి విచారణ, పత్రాల పరిశీలన లేకుండానే రేషన్ కార్డు డేటా ఆధారంగా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ను రెండు రోజుల్లో అందిస్తున్నారని అందువల్ల కుటుంబ ధ్రువీకరణ పత్రంగా పరిగణించలేమని స్పష్టం […]

నిరుద్యోగుల నంచి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు అడ్డుకున్నారు. మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు. మీ మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీడియా కూడా మా సమస్యలను కవర్ చేయడం లేదన్నారు. దీంతో నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక కోదండరాం వెనుదిరిగారు.

కొడాలి నానికి సర్కార్ షాక్..! చనువుగా ఉన్న ఎస్సైపై వేటు..!

గుడివాడ వన్ టౌన్ ఎస్సై సత్యనారాయణ కొడాలి నాని ఇంటికి వెళ్లి ఆయన్ను హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు. దీంతో కొడాలి నాని డీఎస్సీ నిరసనలకు వెళ్లరని అంతా భావించారు. కొడాలి నాని ర్యాలీ నిర్వహించి మరీ డీఎస్సీ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీనికి కారణం స్థానిక ఎస్సై సత్యనారాయణ సహకారమే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఇవాళ ఆయన్ను వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆత్మ‌క‌థ‌ల‌ను చ‌ద‌వండి.. యువ‌త‌ను కోరిన ప్ర‌ధాని మోదీ

ఆత్మ‌క‌థ పుస్త‌కాల‌ను యువ‌త చ‌ద‌వాల‌ని, ఇత‌రుల క‌ష్టాల నుంచి వారు నేర్చుకోవాల‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇది రీల్స్ యుగం అని, కానీ కేవ‌లం షార్ట్‌క‌ట్‌లు నేర్చుకుంటే, జీవితం షార్ట్ అవుతుంద‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆటోబ‌యోగ్ర‌ఫీ ‘ట్రింఫ్ ఆఫ్ ద ఇండియ‌న్ రిప‌బ్లిక్‌: మై లైఫ్బు, మై స్ట్ర‌గుల్స్’ అనే బుక్‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించారు. కోవింద్ ప‌ట్టుద‌ల‌తో చ‌దివి, రాజ్యాంగ హోదాలో అత్యున్న‌త స్థాయికి చేరుకున్న‌ట్లు ప్ర‌ధాని […]

ముంబైలో విరిగిపడ్డ కొండ చరియలు.. 6 గురు దుర్మరణం..

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం వర్షాలకు అల్లాడిపోతుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఘట్‌కోపర్‌లోని చిరాగ్ నగర్‌లోని గౌషియా చాల్ వద్ద ఈ కొండచరియ విపత్తు సంభవించింది. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.శిథిలాల కింద ప్రాణాల ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బాధితులను గుర్తించే కెమెరాలను ఉపయోగిస్తూ, విస్తృతమైన గాలింపు చర్యలను […]

రైతు పొలంలో పురుగు మందు స్ప్రే… 14 మంది కూలీలకు అస్వ‌స్థత

కొత్తగూడెం సుజాతనగర్ మండలం కొత్త అంజినాపురంలో నర్రా అజయ్ పంట పొలంలో 20 మంది కూలీలు పనులు చేసే క్రమంలో పొలం యజమాని మొక్కలకు పురుగుమందు స్ప్రే చేశాడు. స్ప్రే చేసిన సమయంలో కలుపు తీస్తుండగా వారికి పురుగుమందు స్ప్రే కండ్లు, ముక్కుల్లో పడడ‌తో ఆ వాసనకు వారు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్ప‌త్రికి బుధవారం తీసుకువచ్చారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రి వైద్యులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON