loader

తల్లి సహకారం.. కొడుకుల వలపు వల

ఈవెంట్ మేనేజర్ కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ (22) ఖరీదైన అద్దె కార్లలో తిరుగుతూ ఇన్ స్ట్రాగ్రామ్లో ఫొటోలు పెట్టి సంపన్న బాలికలు, యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. వెయ్యిమంది యువతులు ఫాలోవర్స్ ఉన్న అతడికి తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్ ప్రోత్సాహం ఉంది. నిందితుడితో పాటు అతడి సోదరుడు రాజీవ్ ను పొక్సో కింద అరెస్టు చేశారు. 25 మంది మైనర్ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి అర్జున్ అండ్ రాజీవ్ ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా […]

క్యారియర్ సంస్థకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన …

తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని పారిశ్రామిక వాడలో దిగ్గజ సంస్థ కారియర్ ఏసీల తయారీ పరిశ్రమకు క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ ఛైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్ తో కలిసి మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. తమ లక్ష్యం ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే కాదని 20 లక్షల ఉద్యోగాలుకల్పించడమే తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. గ్లోబల్ దిగ్గజం ఏపీకి రావడం ఎంతో ఆనందదాయకమని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం […]

ఓటర్స్‌ లిస్ట్‌ నుంచి తీసేశారు.. అయినా ఎమ్మెల్యేగా గెలిచారు..!

పశ్చిమబెంగాల్‌ SIRలో భాగంగా మొతాబ్‌ షేక్‌ అనే వ్యక్తి పేరును తొలగించారు. తన పేరును తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ మొతాబ్‌ షేక్‌ సుప్రీంకోర్టు నియమించిన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు మొతాబ్‌ ఓటు హక్కును పునరుద్ధరిస్తూ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. దాంతో ఆయన ఫరక్కా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్ వేసి  ఆయన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సునీల్‌ చౌధరిపై ఆయన 8 వేలకుపైగా […]

NDAకు AIADMK రాం రాం..! TVK కు ఎడప్పాడి సలాం..!

అన్నాడీఎంకే పార్టీలో ముసలం బయలు దేరింది. ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విజయ్ కు టచ్ లో వెళ్లారనే టాక్ నడుస్తోంది. అందులో కొంత మంది షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు టీవీకే మద్దతు ఇవ్వాలని కోరారు.  ఎడప్పాడి పళనిస్వామి అలర్ట్ అయ్యారు. అంతేకాదు తమ పార్టీ టీవీకే ఎలాంటి షరతులు లేకుండా బేషరతు మద్దతు ప్రకటించారు. టీవీకే కు చెందిన ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇవ్వాలని ఎడప్పాడి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సూత్రప్రాయంగా […]

మల్కాజిగిరి సీపీ సుమతిని వేధించిన 40 మంది పోకిరీలు

మల్కాజిగిరి సీపీ సుమతి  బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మహిళల భద్రతపై దృష్టి పెట్టారు. సీపీగా కాకుండా.. సగటు మహిళగా ఆమె బస్టాండ్లో నిల్చున్నారు. సాధారణ మహిళలకు ఎదురయ్యే వేధింపులు ఎదుర్కొన్నారు. బస్టాండ్లో నిల్చున్నది. సీపీ అని తెలియక సుమతి చుట్టూ పోకిరీలు చేరారు. సుమారు 40 మంది ఆమెను చుట్టుముట్టారు. రకరకాల ప్రశ్నలతో వేధించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు.. వీరిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.

రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్.. రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ధ్వజం

హనుమకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. వరంగల్ గడ్డ మీద నుంచే కాంగ్రెస్ పార్టీ రైతుల డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద దొంగలు అని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభ పెట్టి దొంగ హామీలిచ్చారని మండిపడ్డారు. బాండ్ పేపర్లు రాసి మరీ కాకమ్మ కబుర్లు చెప్పారని మండిపడ్డారు. ఆ దొంగ హామీలు నమ్మి రైతులు కాంగ్రెస్‌కు ఓటేశారని అన్నారు.

టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు

తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ కు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మధ్యాహ్నం చెన్నెకు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం సమయంలో టీవీకే చీఫ్ విజయ్ ఆయనను లోక్ భవన్ లో కలవనున్నారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు జాబితాను సమర్పించాలని విజయ్ కు గవర్నర్ సూచించారు.

విజయ్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటన..! వాళ్లను చేర్చుకోరాదనే షరతు..!

తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ మద్దతును అందించాలని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్.. తమను లాంఛనంగా కోరారని కాంగ్రెస్ తెలిపింది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు తమ పూర్తి మద్దతును అందించాలని నిర్ణయించాయని తెలిపింది. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని ఏ మతతత్వ శక్తులనైనా ఈ కూటమికి టీవీకే దూరంగా ఉంచితేనే తమ మద్దతు వర్తిస్తుందని షరతు పెట్టింది.

స్మృతి మంధానా మాజీ లవర్ పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాశ్ అనే వ్యక్తి పలాశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలాశ్ సినిమా నిర్మాణం పేరుతో రూ.25 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదని డబ్బుల విషయంలో ప్రశ్నించగా పలాశ్ తనను కులం పేరుతో దూషించాడని విజ్ఞాన్ మానే ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సాంగ్లీ పోలీసులు పలాశ్ ముచ్చల్‌పై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(1)తో పాటు ఐపీసీ సెక్షన్లు 351(2), 352 కింద కేసులు […]

ఏపీకి అనేక దేశాల నుంచి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందదాయకమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమలకు లోకేశ్ శంకుస్థాపన చేశారు. “ఏపీకి అనేక దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు త్వరగా అందుబాటులోకి తెస్తున్నాం. అవకాశాలను అందిపుచ్చుకునే సమర్థత ఏపీలో పుష్కలంగా ఉంది. సమర్థ నాయకత్వంలో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి” అని లోకేశ్ అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON