మల్కాజిగిరి సీపీ సుమతి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మహిళల భద్రతపై దృష్టి పెట్టారు. సీపీగా కాకుండా.. సగటు మహిళగా ఆమె బస్టాండ్లో నిల్చున్నారు. సాధారణ మహిళలకు ఎదురయ్యే వేధింపులు ఎదుర్కొన్నారు. బస్టాండ్లో నిల్చున్నది. సీపీ అని తెలియక సుమతి చుట్టూ పోకిరీలు చేరారు. సుమారు 40 మంది ఆమెను చుట్టుముట్టారు. రకరకాల ప్రశ్నలతో వేధించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.
ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు.. వీరిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.