loader

దివ్య దేశ్‌ముఖ్ … ఛాంపియన్

ఫిడే మహిళల వరల్డ్ కప్‌ ఛాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్ పేరు ప్రస్తుతం దేశమంతా మార్మోగిపోతోంది. 19 ఏళ్లకే భారత గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించిన దివ్య..మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ దివ్య సొంతూరు. ఆమె తల్లిదండ్రులు జితేంద్ర దేశ్‌ముఖ్, నమ్రతా దేశ్‌ముఖ్‌ ఇద్దరూ డాక్టర్లే. దివ్య 4-5 సంవత్సరాల వయస్సులో చెస్‌తో పరిచయం ఏర్పడింది. అక్క బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి వెళ్లినప్పుడు, ఆమెతో వెళ్లిన దివ్య చెస్ క్లాస్‌లో చేరింది. అయిష్టంగానే ఉంటూ చెస్‌ క్లాస్‌లలో నిద్రపోయేది. తల్లిదండ్రుల ప్రోత్సాహం,మొదటి కోచ్ రాహుల్ […]

హరిహర వీరమల్లు సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వైసీపీపై మండిపడ్డ నాగబాబు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. ఇది చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని, ఆ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదని తెలిపారు. వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలకు సూచించారు. మంత్రి పదవిపై నాగబాబు స్పందిస్తూ.. తనకు పదవులపై ఆశ లేదని తెలిపారు. జనసేన కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.

సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్లో చంద్రబాబు

సోమవారం సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు, ప్రముఖ కోచ్ పుల్లెల గోపిచంద్‌తో కలిసి స్పోర్ట్స్ స్కూల్‌ ను సందర్శించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఓంగ్ కిమ్ సూన్‌తో భేటీ అయ్యారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఓంగ్ కిమ్ సూన్ సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ విధానాన్ని వివరించారు. హైపర్‌ఫార్మెన్స్ సిస్టంను అమలు చేసి, 12 ఏళ్ల వయసు నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

మంచిరేవులలో కనిపించి..ఇబ్రహీంబాగ్‌లో ప్రత్యక్షం

నగర శివార్లలోని గండిపేట్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు గతవారం రోజులుగా చుక్కలు చూపిస్తున్న చిరుత గోల్కొండ ఆర్మీ పరిధిలోని ఇబ్రహీంబాగ్‌లో ప్రత్యక్షమయ్యింది. లంగర్‌హౌజ్‌నార్సింగి ప్రధాన రహదారిలో ఆర్మీ సెంటర్ సమీపంలో ఆదివారం రాత్రి చిరుతపులి రోడ్డు దాటుతుండగా గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించగా, సిసి కెమెరాలను పరిశీలించి నిర్థారణ చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలప్రజలను అప్రమత్తం చేశారు.

థాయ్‌లాండ్ – కంబోడియాల మధ్య కాల్పుల విరమణ…

థాయ్‌లాండ్, కంబోడియా దేశాల మధ్య కొనసాగుతన్న ఘర్షణకు తెరపడింది.కంబోడియా, థాయ్‌లాండ్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అంతేకాకుండా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొన్న ఇరుదేశాల నాయకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వివాదాస్పద 800 కి.మీ సరిహద్దులో ఇరువైపులా 35 మంది మరణించగా, 2,60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు థాయ్‌లాండ్, కంబోడియాలు వాటి మధ్య ఘర్షణను ఆపడానికి అంగీకరించకపోతే… ఇరుదేశాలతో అమెరికా వాణిజ్య చర్చలు నిలిపివేయబడతాయని […]

మీనాక్షి నటరాజన్ పాదయాత్ర…ముహూర్తం ఖరారు

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. స్థానిక సంస్తల ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం చేసే పనిలో భాగంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర షురూ కానున్న పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్‌చార్జిమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు […]

గంగూలీపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం..

సౌరవ్ గంగూలీ ఆసియా కప్ భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై కామెంట్స్ చేశాడు. ‘క్రీడలు కొనసాగాలి. అలాగే, పహల్గామ్ వంటి ఉగ్రవాద దాడులు జరగకూడదు. ఉగ్రవాదం జరగకూడదు, దానిని ఆపాలి. భారతదేశం దీనిపై కఠినమైన వైఖరి తీసుకుంది, కానీ అది గతానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఆటలు ముందుకు సాగాలి. ఆటలు కొనసాగాలి’ అని సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే గంగూలీ వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. విమర్శలు చేస్తున్నారు. ప్రజల మనోభావాలు పట్టవా? […]

మహిళా గ్రాండ్ మాస్టర్‌‌గా దివ్య దేశ్‌ముఖ్..

జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ టైబ్రేకర్లలో తన స్వదేశీయురాలు కోనేరు హంపీని ఓడించి గెలుచుకుంది. మొదటి గేమ్‌ను డ్రా చేసుకున్న 19 ఏళ్ల దివ్య రెండవ రాపిడ్ గేమ్‌లో విజయం సాధించింది. బ్లాక్ పావులతో ఆడుతున్న హంపి.. ఓ తప్పిదం చేయడంతో.. దివ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని  తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని సాధించి, భారత్ తరపున 4వ మహిళా గ్రాండ్ […]

అమెరికా వీసా ఇంటర్వ్యూ మినహాయింపుల్లో మార్పులు..

ఇకపై నాన్‌ఇమిగ్రెంట్‌ వీసా కోసం అప్లై చేసుకునే చాలా మంది ఇప్పుడు అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో పర్సనల్‌ ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. 14 ఏళ్లలోపు పిల్లలు, 79 ఏళ్లు పైబడిన పెద్దలు కూడా అటెంట్‌ చేయాల్సిందే. గతంలో చాలా మంది ‘డ్రాప్‌బాక్స్’ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్వ్యూలను స్కిప్‌ చేసే ఛాన్స్‌ ఉండేది. మెయిల్ ద్వారా డాక్యుమెంట్స్‌ సబ్మిట్‌ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ఆప్షన్‌ కొన్ని స్పెసిఫిక్‌ కేసులకు మాత్రమే వర్తిస్తుంది.

జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు పహల్గం ఉగ్రవాదుల హతం

భారత్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ చేపట్టింది.ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ అంతట కూడా జల్లెడ పడుతున్నారు. జమ్ములోని దాచిగామ్ అడవుల్లో ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నట్లు భద్రత బలగాలు గుర్తించాయి. వెంటనే మూకుమ్మడిగా చుట్టుముట్టి.. ఉగ్రవాదులపై కాల్పులతో తెగ బడ్డాయి. ముగ్గురు టెర్రరిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ముఖ్యంగా వీరు పహల్గంలో అమాయకుల టూరిస్టుల ప్రాణాలు బలితీసుకున్న వారు కావడంతో.. భద్రత ధళాలు వీరిపై మరింతగా తమ తడాఖా చూపించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON