ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. స్థానిక సంస్తల ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం చేసే పనిలో భాగంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర షురూ కానున్న పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్చార్జిమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.

