తమిళనాడులో సంపూర్ణంగా గోవధ నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విజయ్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తమిళనాడు పశు సంరక్షణ చట్టం గోవధపై పూర్తి నిషేధాన్ని విధించడం ద్వారా హైకోర్టు చట్ట పరిధిని దాటిందని, ఈ ఉత్తర్వు చట్టంలోని నిబంధనల పరిధిని మించిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ఆరోపించింది.10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, పనికి లేదా సంతానోత్పత్తికి పనికిరానిదిగా ఉండి, అధికారులు ధృవీకరించబడిన ఆవును మాత్రమే వధించడానికి అనుమతి ఉంది.