రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో ఒళ్ళు గగుర్పొడిచే అత్యంత అమానవీయ ఘటన వెలుగుచూసింది. కేవలం 13 ఏళ్ల మైనర్ బాలికపై ఐదు రోజుల పాటు 30 మందికి పైగా కామాంధులు పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఈ దారుణానికి సహకరించిన, అండగా నిలిచిన పలు హోటళ్లపై మంగళవారం రాత్రి బుల్డోజర్లను మోహరించి, ఈ దారుణంతో సంబంధం ఉన్న నాలుగు హోటళ్లను నేలమట్టం చేశారు. నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హరిశంకర్ స్పష్టం చేశారు.