ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా పరిధిలో బుధవారం (జూలై 1) తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రతిష్టాత్మక ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్వే పై ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఒక లగ్జరీ స్లీపర్ బస్సు.. ముందు వెళ్తున్న ఒక కారును వెనుక వైపు నుండి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఆపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ దారుణ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అమాయక పిల్లలతో సహా ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.