పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్యనగర్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు కలకలం రేపాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ ను విచారించినట్లు సమాచారం. విద్యార్థి కదలికలు, సంబంధాలు, ఇతర అంశాలపై ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్థిపై ఉన్న ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.