మహబూబ్ నగర్ జిల్లా 44వ జాతీయ రహదారిపై భూత్పూర్ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి పాండిచ్చేరి వెళ్తున్న బస్సు డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉండగా.. 10 మందికి గాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ మేరకు ఘటనాస్థలిని ఎస్పీ జానకి పరిశీలించారు.