ఆగ్నేయ ఇంగ్లాండ్ లోని లూయిస్ (Lewes) సమీపంలో గురువారం ఒక ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ప్రమాదంలో ఒక బోగీ పూర్తిగా బోల్తా పడటంతో అత్యవసర సహాయక బృందాలు, బ్రిటీష్ ట్రాన్స్ పోర్ట్ పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. బ్రిటన్ రవాణా కార్యదర్శి హైడీ అలెగ్జాండర్ ఈ ఘటనపై స్పందిస్తూ విచారణకు ఆదేశించారు.