ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు శుక్రవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు తమ ప్రధాని తారిక్ రహమాన్కు ఆహ్వానం అందలేదని బంగ్లాదేశ్ తెలిపింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హుమాయున్ కబిర్ గురువారం వెల్లడించారు. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం లేనందున తమ ప్రధాని ఇండియా వెళ్లడం లేదని ఆయన తెలిపారు. బిమ్స్టెక్ కూటమికి ప్రస్తుతం బంగ్లాదేశ్ అధ్యక్షత వహిస్తున్నందున ఈ హోదాలో బంగ్లాకు ప్రత్యేక ఆహ్వానం అందిందన్న ప్రచారాన్ని హుమాయున్ కబిర్ కొట్టిపారేశారు.