18వ బ్రిక్స్ దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిని మరింత సమ్మిళితంగా మార్చేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరత్వం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు.
బ్రిక్స్ అనేది గ్లోబల్ సౌత్ దేశాల మధ్య రాజకీయ, దౌత్య, ఆర్థిక సహకారం కోసం ఏర్పడిన అంతర్జాతీయ సమన్వయ వేదిక.