రష్యా పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF) సమావేశం మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుందనగా.. సెయింట్ పీటర్స్బర్గ్, నోవోగోరోడ్ వంటి సుదూర ప్రాంతాల లక్ష్యంగా ఉక్రెయిన్ భీకర దాడి చేసింది.సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారని.. మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయని డ్రోన్ శకలాల నుంచి చెలరేగిన మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని అక్కడి గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్ వెల్లడించారు.