నాంపల్లి స్టేషన్లోని మూడో ప్లాట్ఫాంపై ఆగి ఉన్న జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్వే కోచ్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. శుక్రవారం సాయంత్రం సుమారు 6.30 గటంలకు ఎసీ కోచ్ బీ 2 లోంచి ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. క్షణాల్లో నలువైపులా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.