మే 26న కేరళకు నైరుతీ రాక.. రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన
భారతీయ వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాల మే 26వ తేదీ వరకు కేరళలో ప్రవేశించనున్నట్లు ఐడీఎం తెలిపింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ వరకు నైరుతీ రుతుపవనాలు కేరళ చేరుకుంటాయి. ఆ రుతుపవనాలు కేరళ చేరుకోవడంతో భారత్లో వర్షాకాలం మొదలువుతుంది. గత ఏడాది మే 24వ తేదీన కేరళకు నైరుతీ రుతుపవనాలు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీన ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది.

