పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబ గుర్తొస్తారని, సత్యసాయిబాబా బోధనలతో విశ్వశాంతికి కృషి చేశారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. పుట్టపర్తి దేశం గర్వించే రక్షణ కేంద్రంగా తయారవుతుందని తెలిపారు. యుద్దాల్లో వాడే డ్రోన్ కర్నూలు లో తయారు చేయడం ఎపికి గర్వకారణం అని దేశంలో ఆధునిక డ్రోన్ సిస్టమ్ ఎపిలో తయారైందని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో ఐరన్, ఓర్, టైమ్ స్టోన్ ఉందని, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.