కొలంబియా దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 15 మంది మరణించారు. ఈ ఘటన కొలంబియా ఈశాన్య ప్రాంతమైన నోర్తే డి సాంటాండర్ ప్రావిన్స్లో జరిగింది. చిన్న ప్రయాణికుల విమానం గ్రామీణ..కొండ ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.సటేనా అనే ప్రభుత్వ విమాన సంస్థకు చెందిన ఈ విమానం, కుకుటా నగరం నుంచి ఓకానా అనే పట్టణానికి వెళ్తోంది.

