గుజరాత్లోని సానంద్లో ఏర్పాటు చేసిన మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, ప్యాకేజింగ్) ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా నిర్మించిన ఈ అత్యాధునిక కర్మాగారం నుంచి వాణిజ్యపరమైన ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభం కాగా, తొలి స్వదేశీ సెమీకండక్టర్ మెమరీ మాడ్యూల్స్ షిప్మెంట్ను సైతం ఈ సందర్భంగా ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. సెమీకండక్టర్ సప్లై చైన్లో భారతదేశ స్థానాన్ని పటిష్టం చేయడంలో మైలురాయిగా నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది..

