ఇరాన్ ప్రభుత్వం తన స్వదేశీ పౌరులపై కూడా దాడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలైన ఈ రెండు నెలల కాలంలోనే కనీసం 21 మందిని ఆ దేశ ప్రభుత్వం ఉరితీసిందని, 4,000 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చీఫ్ వోల్కర్ టర్క్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. జనవరిలో జరిగిన నిరసనల కారణంగా 9 మందికి, ప్రతిపక్ష గ్రూపులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 10 మందికి, గూఢచర్య నేరంపై మరో ఇద్దరికి మరణశిక్షలు అమలు చేశారు.

