న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తనకు కింగ్ ఛార్లెస్-3తో మాట్లాడే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని కోరేవాడినన్నారు. కోహీనూర్ వజ్రాన్ని అప్పగించమని కింగ్ ఛార్లెస్ను ఎంకరేజ్ చేసేవాడినని ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బ్రిటీష్ చక్రవర్తి కింగ్ ఛార్లెస్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ కింగ్ ఛార్లెస్ను కలిస్తే ఏం అడుగుతారని మామ్దానీని అడిగిన సందర్భంలో ఆయన ఈ సమాధానం ఇచ్చారు.

