loader

ప్రమాద కారణాలు అంతకంటే ముఖ్యం- ఫ్లైట్ క్రాష్‌‌పై అమెరికా న్యాయవాది కీలక వ్యాఖ్యలు

ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన ఘటనపై బాధితుల తరఫు న్యాయవాది మైక్ ఆండ్రూస్ కీలక వ్యాఖ్యలు చేశారు. విమానం కూలిపోయి ఆరు నెలలు గడిచినా బాధిత కుటుంబాలు సమాధానాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ముఖ్యమైందేనని, అయితే అసలేం జరిగింది, విమానం ఎలా కూలింది, ఎందుకు కూలిందనే సమాచారం అంతకంటే ముఖ్యమైందని ఆయన తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్‌ డైరెక్టర్‌ దంపతులు మృతి- శరీరాలపై కత్తిగాయాలు

హాలీవుడ్‌ డైరెక్టర్‌ రాబ్‌ రీనర్‌ (78), ఆయన సతీమణి మిచెల్‌ సింగర్‌  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లాస్‌ ఏంజెలెస్‌లోని తమ నివాసంలో  వారి శరీరాలపై కత్తిగాయాలతో మృతదేహాలు కనిపించాయి. ప్రస్తుతం పోలీసులు దీనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాబ్‌ రీనర్‌ ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించారు. ఆయన ‘స్టాండ్‌ బై మీ’, ‘ది ప్రిన్సెస్‌ బ్రైడ్‌’, ‘వెన్‌ హ్యారీ మెట్‌ సాలీ’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు.

నేటి నుంచి హెచ్ 1బీ, హెచ్4 వీసాల సోషల్ మీడియా స్క్రీనింగ్..

హెచ్ 1బీ, హెచ్4 వీసాలకు సంబంధించిన పూర్తిస్థాయి స్క్రీనింగ్, పరిశీలన ఈరోజు(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా అమెరికా పరిశీలించనుంది. కేవలం హెచ్1 బీ వీసా దరఖాస్తుదారుల ఖాతాలను మాత్రమే కాకుండా.. హెచ్ 4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనుంది. వీసా దరఖాస్తుదారులు తమ ఖాతాను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని సూచించింది. ఇండియాకు చెందిన హెచ్ 1 బీ వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే […]

బోండీ బీచ్ ఘటన తండ్రీకొడుకుల పనే- 16కు చేరిన మృతుల సంఖ్య

ఆస్ట్రేలియాలోని బోండీబీచ్‌లో యూదుల హనూకా వేడుకలపై దాడి చేసిన వారిని దర్యాప్తు బృందం గుర్తించింది. నవీద్‌ అక్రమ్‌ (24), సాజిద్‌ అక్రమ్‌ (50) అనే తండ్రీకొడుకులు ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు పేర్కొంది. పోలీసులు జరిపిన ఎదురుదాడిలో సాజిద్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. గాయపడ్డ 40 మందికి సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. యూదులపై కాల్పుల ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ఫుట్‌బాల్ దిగ్గజంతో క్రికెట్ గాడ్.. స్పెషల్ జెర్సీతో ఫొజిచ్చారిలా..!

అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీకి అపూర్వ స్వాగతం లభిస్తోంది. కోల్‌కతా, హైదరాబాద్ పర్యటన తర్వాత ఆదివారం ముంబై చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు వాంఖడే స్టేడియం చేరుకున్న ఫుట్‌బాల్ దిగ్గజాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కలిశాడు. తన పదో నంబర్ టీమిండియా జెర్సీని మెస్సీకి కానుకుగా అందించాడు సచిన్. సాకర్ మాంత్రికుడి జెర్సీ నంబర్ కూడా 10 కావడం విశేషం. జెర్సీ బహూకరణ సమయంలో మెస్సీతో ముచ్చటించిన మాస్టర్ బ్లాస్టర్.. […]

ఆస్ట్రేలియాసిడ్నీ కాల్పుల ఘటనలో రోమాలు నిక్కబొడిచే సీన్.. దుండగుడి నుంచి తుపాకీ లాక్కొని.

సిడ్నీలోని ప్రసిద్ధ బోండి బీచ్‌లో కాల్పుల ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు బోండి బీచ్ వద్ద  వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరుపిన ఆ సమయంలో, ఒక వ్యక్తి తన ప్రాణాలను పణ్ణంగా పెట్టి, దాడి చేసిన దుండగుడిని వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆ ధైర్యవంతుడైన వ్యక్తి దుండగుడి నంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తోసేసి, అతనికే గురి పెట్టాడు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పార్క్ చేసిన కార్ల వెనుక […]

బీచ్‌లో ఉగ్రదాడి.. ముష్కరుల కాల్పుల్లో 10 మందికిపైగా పర్యాటకులు మృతి

ఆస్ట్రేలియాలో దుండుగులు రెచ్చిపోయారు. ప్రముఖ బీచ్‌లో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన ఈ ఘటనలో కనీసం 10 మంది పర్యాటకులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మొత్తం 50 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమవ్వగా.. మరొకర్ని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులతో పర్యాటకుల హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ప్రశాంతంగా ఉన్న బీచ్‌లో ఒక్కసారిగా […]

దక్షిణాఫ్రికాలో కూలిన హిందూ దేవాలయం.. భారత సంతతి వ్యక్తి మృతి

దక్షిణాఫ్రికాలోని న్యూ అహోబిలం దేవాలయం కూలడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ో టెంపుల్ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న విక్కీ జయరాజ్ పాండే ఉన్నారు. క్వాజూలు-నటాల్ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల మేర ఉన్న దేవాలయంలో విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకుని పలువురు మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు, దేవాలయానికి వచ్చిన ఓ భక్తుడు ఉన్నట్టు సహాయక బృందాలు తెలిపాయి

బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పులు: ఇద్దరు మృతి… 8 మందికి గాయాలు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపింది. రోడ్డు ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఇంజనీరింగ్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు దుర్మరణం చెందగా 8 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు

బాహుబలి కాదు అంతకు మించి.. భారత్–అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి బ్లూబర్డ్‑6 ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహాన్ని LVM-03 M6 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది బ్లూబర్డ్ శాటిలైట్. భారత్‑అమెరికా సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నాయి. బాహుబలి 2 రాకెట్ అన్నట్లు LVM- 03 అప్‌గ్రేడ్ అయింది.. 6.5 టన్నుల బరువున్న అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశ పెట్టనుంది..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON