loader

వేగంగా ఏఐ విస్తరణ వేళ..ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు

ఒక సీఈవో చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ను అతలాకుతలం చేసిపారేస్తున్నాయి. ఆరు నెలలు.. మహా అయితే ఏడాదిలోపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల అవసరం లేకపోవచ్చు.. అంటూ ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడి చెప్పిన మాటలు ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి దాకా ప్రోగ్రామర్లకు సహాయం చేసిన ఏఐ టూల్స్‌.. సహకారం అందించడం కాకుండా.. స్వయంగా కోడ్‌ రాసేస్తున్నాయని అతి త్వరలోనే మొత్తం డెవలప్‌మెంట్‌ ప్రాసెస్‌ను ఏఐ హ్యాండిల్‌ చేయగలదని డారియో అమోడి అంచనా వేస్తున్నారు.

క్లోజ్‌ ఫ్రెండ్స్‌.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌!

యాప్‌ వాట్సాప్ కొత్త ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తుంది మీరు ప్రతిసారీ స్టేటస్ పోస్ట్ చేసేటప్పుడు మీ ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు చేసే బదులుగా, మీరు ముందుగానే సన్నిహిత స్నేహితుల జాబితాను సృష్టించవచ్చు. అప్పుడు మీరు వారితో ఏదైనా పంచుకోవాలనుకున్నప్పుడు, మీరు ఆ జాబితాను ఎంచుకుంటారు. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ స్టేటస్ పోస్ట్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ పిక్చర్ చుట్టూ రంగు రింగ్ ఉండటం కూడా తేడాను కలిగిస్తుంది. ఆండ్రాయిడ్  వాట్సాప్ బీటాలో క్లోజ్ […]

గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసల జల్లు

ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశీయంగా అభివృద్ధి చెందిన సర్వం AI ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సర్వం AI సాధించిన విజయాన్ని కొనియాడారు. గతంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన డిడి దాస్, సర్వం AI సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ఒక ఏడాది క్రితం ఇండిక్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి నాకున్న అంచనా తప్పు అని సర్వం నిరూపించింది. దీని టెక్స్ట్-టు-స్పీచ్, OCR సామర్థ్యాలు అద్భుతం’’ […]

సాంకేతిక ఆవిష్కరణ సృష్టికర్తగా ఏపీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ – మంత్రి నారా లోకేష్

ఇది కేవలం సాధారణ భూమిపూజ కార్యక్రమం కాదు. ఈరోజు అమరావతిలో భారతదేశ క్వాంటమ్ టెక్నాలజీలలో భవిష్యత్ నాయకత్వానికి పునాది వేస్తున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మూడు బలాలు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు క్వాంటమ్ విప్లవాన్ని భారత్ ఎందుకు అనుసరించాలి? దేశమే దానిని ఎందుకు ముందుండి నడిపించకూడదు అని. ఆ ప్రశ్నకు సమాధానమే అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ప్రపంచంలోనే మొట్టమొదటిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టి క్వాంటమ్ […]

స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో అగ్నీ-3 పరీక్ష విజయవంతం

భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్‌‌లో ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్ష్యాలు అన్నిటినీ మిసైల్ అందుకుందని రక్షణ శాఖ తెలిపింది.  అగ్నీ-3 మిసైల్ 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, అగ్నీ-4 మిసైల్‌ 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇక అగ్నీ-5 మిసైల్ రేంజ్ అత్యధికంగా […]

ఇకపై త్వరగా కేసుల పరిష్కారం – ‘ఏఐ4 ఏపీ పోలీస్‌’తో నూతన ప్రాజెక్ట్​

పోలీసింగ్‌లో కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ‘ఏఐ4 ఏపీ పోలీస్‌’ పేరిట రాష్ట్రంలోని చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టుల అమలును డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా బుధవారం ప్రారంభించారు. 8 రకాల ఏఐ టూల్స్‌ ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం, డిజిటల్‌ సాక్ష్యాల విశ్లేషణ, ఆధార సహిత దర్యాప్తు, దర్యాప్తు అధికారికి సాంకేతిక సహకారం, సామాజిక మాధ్యమాలపై నిఘా తదితర అంశాలకూ ఉపయోగపడనున్నాయి.

నాసా నుంచి ‘అథీనా’- మోస్ట్ పవర్​ఫుల్ సూపర్​కంప్యూటర్

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా “అథీనా” అనే కొత్త సూపర్ కంప్యూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది కొత్త తరం మిషన్లు, పరిశోధనా ప్రాజెక్టుల కోసం రూపొందించిన అధునాతన వ్యవస్థ. ఇంకా క్లియర్​గా చెప్పాలంటే అథీనా అనేది ఒక పెటాస్కేల్ సూపర్ కంప్యూటర్. నాసా ఇప్పటివరకు రూపొందించిన తన అత్యంత శక్తివంతమైన సూపర్​కంప్యూటర్ ఇదేనని చెబుతోంది. ఇది నాసా హై-ఎండ్ కంప్యూటింగ్ కేపబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగం. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు స్పేస్, ఏరోనాటిక్స్ అండ్ సైన్స్‌లోని కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలో […]

గూగుల్ ఇంటర్న్‌షిప్‌..యువత కోసం గోల్డెన్ ఛాన్స్

ప్రపంచనేపథ్యలో టెక్ దిగ్గజంగా గుర్తింపు పొందిన గూగుల్ 2026 కోసం వివిధ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అవకాశాలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పీహెచ్‌డీ విద్యార్థుల కోసం ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు స్టైపెండ్ తో పాటు, బెంగళూరు, పూణే, హైదరాబాద్ లోని గూగుల్ ఆఫీసుల్లో ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం కూడా లభిస్తుంది. దరఖాస్తు చివరి తేది మార్చి 31, 2026 https://www.google.com/about/careers/applications/

భారత్​లో 5జీ యూజర్లు 40 కోట్లు- జ్యోతిరాదిత్య సింధియా

ప్రపంచంలో 5జీ నెట్​వర్క్​ వినియోగంలో భారత్​ రెండో అతిపెద్ద దేశంగా నిలిచిందని భారత కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. “40 కోట్లకు పైగా 5G వినియోగదారులతో, భారత్​ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G చందాదారుల స్థావరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఈ సాంకేతికతను స్వీకరిస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచింది. 110 కోట్ల యూజర్లతో చైనా మొదటి స్థానంలో నిలువగా, 35 కోట్ల వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది.

చెవిలో చాట్​జీపీటీ?- వినూత్న సాంకేతికతో ఓపెన్‌ఏఐ తొలి హార్డ్‌వేర్ వస్తోంది!

ఓపెన్‌ఏఐ 2026 కోసం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కాని ఒక వినూత్న స్మార్ట్ పరికరాన్ని రూపొందిస్తోంది. ఇది ఒక చిన్న కంప్యూటర్​ మాదిరిగా పనిచేస్తుంది, అయితే దీనికి స్క్రీన్ ఉండదు. ఇది పూర్తిగా వాయిస్​పైనే ఆధారపడి ఉంటుంది. లీక్‌ల ప్రకారం, ఈ పరికరాన్ని “స్వీట్‌పీ (SweetPie)” అని పిలుస్తారు.  2023లో ప్రముఖ డిజైనర్ జానీ ఐవ్ (Jony Ive) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నప్పుడు ప్రారంభమైంది. జానీ ఐవ్, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON