డీపీలు మార్చి.. ఉద్యోగులను ఏమార్చి.. సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసాలు!
సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలు వెతుకుతున్నారు. అందినకాడికి డబ్బులు దండుకునేందుకు ఐటీ సంస్థల యజమానులు, హెచ్ఆర్ మేనేజర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వెంటపడ్డారు. కంపెనీల సీఎండీ, ఎండీ, సీఈవోల ఫొటోలతో డీపీలు సెట్ చేసుకుని, కంపెనీలోని అకౌంట్స్ ఆఫీసర్లు, హెచ్ఆర్ మేనేజర్లు, సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు మెసేజ్లు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇటువంటి ఉదంతాలు తెలంగాణలో వెలుగు చూస్తుండటంతో కొత్తతరహా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.