loader

డీపీలు మార్చి.. ఉద్యోగులను ఏమార్చి.. సైబర్‌ నేరగాళ్ల సరికొత్త మోసాలు!

సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలు వెతుకుతున్నారు. అందినకాడికి డబ్బులు దండుకునేందుకు ఐటీ సంస్థల యజమానులు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల వెంటపడ్డారు. కంపెనీల సీఎండీ, ఎండీ, సీఈవోల ఫొటోలతో డీపీలు సెట్‌ చేసుకుని, కంపెనీలోని అకౌంట్స్‌ ఆఫీసర్లు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు, సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు మెసేజ్‌లు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇటువంటి ఉదంతాలు తెలంగాణలో వెలుగు చూస్తుండటంతో కొత్తతరహా సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

జిబ్లీ వాడకం తగ్గించరూ..ప్లీజ్‌.. నెటిజన్లను కోరిన ఆల్ట్‌మన్‌

చాట్‌జీపీటీలో ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమేజ్‌ జెనరేటర్‌ ‘జీబ్లీ’ స్టూడియోకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభిస్తున్నది. దీంతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌..ఇలా దేంట్లో చూసినా జిబ్లీ ఫొటోలు కనిపిస్తున్నాయి. జిబ్లీ ఇమేజ్‌ జనరేటర్‌ను విస్తృతంగా వాడటం వల్ల తమ ఉద్యోగులకు విశ్రాంతి లేకుండా పోయిందని ఓపెన్‌ ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ వాపోయారు. దయచేసి దీని వాడకాన్ని తగ్గించుకోవాలని నెటిజన్లను ఆయన కోరారు.

ఏపీలో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులందరూ తొలగింపు

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ సంస్థ విషయంలో ఇటీవల పెద్ద వివాదం నడిచింది. ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి పదవితో పాటుగా తెలుగు దేశం పార్టీకి కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అనంతరం ఫైబర్‌నెట్‌ ఎండీగా ఉన్న దినేష్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే తాజాగా ఫైబర్ నెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్‌నెట్‌లో నియామక ఉత్తర్వులు లేకుండా విధుల్లో కొనసాగుతున్న సిబ్బందిని తప్పిస్తున్నారు. 417 మందిని తొలగించారు.. జీతాలు కూడా నిలిపేశారు. తాజాగా మరో […]

‘గ్రోక్‌’ తగ్గేదేలే..!

కేంద్రం విధించాలనుకొంటున్న ఆంక్షలపై ‘గ్రోక్‌’ ఎంతమాత్రం భయపడటం లేదు. కేంద్రంపై దీటుగా పోరుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.  ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79(3)(బీ)ని సాకుగా చూపుతూ ఎక్స్‌లో ఉన్న నిర్దిష్ట సమాచారాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని ఈ ఫిర్యాదులో ఎక్స్‌ ఆరోపించింది. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘ఆన్‌లైన్‌లో భావ స్వేచ్ఛా ప్రకటన’ తీర్పునకు వ్యతిరేకమని వాదించింది. తమ కంటెంట్‌పై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎక్స్‌ వాదించింది.  కేంద్రం […]

కంపెనీల్లో 50% కోడింగ్‌ ఏఐతోనే

టెక్‌ ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్స్‌ వినియోగంలో ప్రావీణ్యం సాధించాలని ‘చాట్‌ జీపీటీ’ మాతృ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక సూచన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీల్లో కోడింగ్‌ పనుల కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారని, ప్రస్తుతం అనేక కంపెనీల్లో 50%పైగా కోడింగ్‌ పనులను ఏఐ నిర్వహిస్తోందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెక్‌ ఉద్యోగాల్లో చేరాలనుకునే విద్యార్థులంతా ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని […]

గ్రోక్ బూతులపై కేంద్రం ఆరా.. ఎక్స్‌తో టచ్‌లోకి ఐటీ శాఖ..!

నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ గ్రోక్ చాట్ బాట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తెలుగు, హిందీ లాంటి భాషల్లో యాసలను, బూతులను అలవోకగా వాడేస్తోంది. ఈ విషయం భారత ప్రభుత్వం దృష్టికి రావడంతో.. కేంద్ర ఐటీ శాఖ రంగంలోకి దిగింది. గ్రోక్ చాట్ బాట్ అసభ్యకరమైన భాషలో సమాధానాలు ఇస్తుండటం పట్ల కేంద్రం సీరియస్‌‌గా ఉందని సమాచారం. ఈ విషయమై ‘ఎక్స్’తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది.

286 రోజుల తర్వాత భూమి మీదకు సురక్షితంగా సునీత..

సునీత విలియమ్స్ భూమి మీదకు ఎట్టకేలకు అడుగు పెట్టారు. క్యాప్సూల్ నుంచి స్ట్రక్చర్ పై బయటికి వచ్చాక అందరికీ చెయ్యి ఊపుతూ నవ్వుతూ ఆమె ముఖం కనిపించింది. ఆమెను వెంటనే వైద్య సేవలపై ఆసుపత్రికి తరలించారు 46 రోజులు పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది. సునీతతో పాటు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు వాళ్లని తీసుకురావడానికి వెళ్లిన మరికొందరు ఆస్ట్రోనాట్స్ ‘క్రూ డ్రాగన్ హ్యూమన్’ తెల్లవారుజామున 3:27 కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర […]

ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ..

అమెరికా దిగ్గజ టెక్నాలజీ సంస్థ యాపిల్ భారత్‌లో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి ప్రారంభించనుంది. తైవాన్ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్‌కి చెందిన హైదరాబాద్ ప్లాంట్‌లో వచ్చే నెల ఏప్రిల్ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ ప్రారంభం కానుంది. ఇక్కడ తయారైన ఎయిర్‌పాడ్స్ తొలుత విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. 2023, ఆగస్టు నెలలో ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్ సంస్థ 400 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 3,500 కోట్లు మేర పెట్టుబడులు పెట్టిన ఫాక్స్‌కాన్ సంస్థ

సునీతా విలియమ్స్ త్వరలో భూమికి.. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమిపై కాలు మోపనున్నారు.అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి భూమికి తీసుకురావడానికి నాసా, స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. ఫాల్కన్ 9 రాకెట్ మార్చి 14, 2025న శనివారం ఉదయం 4:33 గంటలకు  అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లి, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ వ్యోమనౌక, […]

మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చే శక్తి యాప్‌

మహిళలు ఆటోలో ప్రయాణించే సందర్భంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే.. శక్తి యాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే..ఆ సమాచారాన్ని తల్లిదండ్రులతోపాటు పోలీసులకు పంపించవచ్చు. వేధింపులు, ర్యాగింగ్‌లు   మహిళల చిత్రాలను మార్ఫింగ్‌ చేసి.. వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి.. బాధితులను బెదిరించి సొమ్ము చేసుకునే నేరాలు పెరిగిపోయాయి. వీటిపైనా నేరుగా ఈ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ పాఠశాల, కళాశాలలో పోలీసులు ‘సంకల్పం’ పేరిట ‘డ్రాప్‌బాక్స్‌’లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా బాధిత మహిళలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON