loader

భారత్​లో 5జీ యూజర్లు 40 కోట్లు- జ్యోతిరాదిత్య సింధియా

ప్రపంచంలో 5జీ నెట్​వర్క్​ వినియోగంలో భారత్​ రెండో అతిపెద్ద దేశంగా నిలిచిందని భారత కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. “40 కోట్లకు పైగా 5G వినియోగదారులతో, భారత్​ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G చందాదారుల స్థావరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఈ సాంకేతికతను స్వీకరిస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచింది. 110 కోట్ల యూజర్లతో చైనా మొదటి స్థానంలో నిలువగా, 35 కోట్ల వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది.

చెవిలో చాట్​జీపీటీ?- వినూత్న సాంకేతికతో ఓపెన్‌ఏఐ తొలి హార్డ్‌వేర్ వస్తోంది!

ఓపెన్‌ఏఐ 2026 కోసం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కాని ఒక వినూత్న స్మార్ట్ పరికరాన్ని రూపొందిస్తోంది. ఇది ఒక చిన్న కంప్యూటర్​ మాదిరిగా పనిచేస్తుంది, అయితే దీనికి స్క్రీన్ ఉండదు. ఇది పూర్తిగా వాయిస్​పైనే ఆధారపడి ఉంటుంది. లీక్‌ల ప్రకారం, ఈ పరికరాన్ని “స్వీట్‌పీ (SweetPie)” అని పిలుస్తారు.  2023లో ప్రముఖ డిజైనర్ జానీ ఐవ్ (Jony Ive) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నప్పుడు ప్రారంభమైంది. జానీ ఐవ్, […]

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయ్యింది.!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయినట్టు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ చేస్తున్నారు. మేము చెక్ చేసినప్పుడు మాత్రం కొంత నెమ్మదిగా ఫీడ్ రిఫ్రెష్ అయినా వెబ్సైట్ మాత్రం బాగానే పని చేసింది. కానీ డౌన్ డిక్టేటర్ లో అందుకున్న రిపోర్ట్స్ ప్రకారం యాప్ లాగిన్ మరియు ఫీడ్ రిఫ్రెష్ వంటి మరిన్ని సమస్యలు కొంత మంది యూజర్లు చూస్తున్నట్లు చెబుతున్నారు.సాయంత్రం 7 గంటల 38 నిమిషాల నుంచి డౌన్ అయినట్లు రిపోర్ట్

ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్న మెటా.. 1500 మందిపై వేటు..?

ఐటీ సహా వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ త్వరలోనే 1500 మంది సిబ్బందిని తొలగించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మెటా’ గ్రూపునకు చెందిన రియాలిటీ ల్యాబ్స్ డివిజన్ అనే సంస్థ నుంచి పది శాతం సిబ్బందిని తొలగించనుంది. ఈ కంపెనీలో దాదాపు 15,000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. పది శాతం అంటే.. 1500 మంది వరకు సిబ్బందికి ఉద్వాసన పలకనుంది. ‘ వర్చువల్ […]

వరుసపెట్టి ఈమెయిల్స్‌తో యూజర్లలో టెన్షన్.. వర్రీ వద్దన్న ఇన్‌స్టాగ్రామ్

గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లోని యూజర్లకు వరుసపెట్టి పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లాయి. ఇన్‌స్టా మాత్రం ఈ వార్తలను ఖండించింది. తమ యూజర్ల డేటాకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసింది. అంతా సవ్యంగానే ఉందని వివరణ ఇచ్చింది. ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. చిన్న సాంకేతిక లోపం కారణంగా యూజర్లకు పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లాయని ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్ వేదికగా తెలిపింది. డేటా భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని తెలిపింది.

గ్రోక్ అసభ్య కంటెంట్ ఎఫెక్ట్.. 600 అకౌంట్లు డిలీట్..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ను ఉపయోగించి కొందరు అశ్లీల కంటెంట్‌ను సృష్టించారంటూ కేంద్రం సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టిన ‘ఎక్స్’.. సుమారు 600 అకౌంట్లను వెంటనే డిలీట్ చేసింది. అలాగే ఆ కంటెంట్‌తో సంబంధమున్న సుమారు 3,500 పోస్టులను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌లో అశ్లీల కంటెంట్‌ను అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని ‘ఎక్స్’ హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

12న పిఎస్‌ఎల్వీ 62 రాకెట్ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 12న మరో ప్రతిష్ఠాత్మకమైన వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీ లోని శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీసీ62 రాకెట్‌ను ఈ రాకెట్ ద్వారాడీఆర్‌డీవో రూపొందించిన ఈఓఎస్‌ఎన్ 1 శాటిలైట్‌ను 12 వ తేదీ ఉదయం 10.17 గంటలకు అంతరిక్షం లోకి పంపిస్తుంది. ఈ 9 వ వాణిజ్య మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఇవిఎస్ ఎన్1)తోపాటు దేశీయ, విదేశీ వినియోగదారులకు చెందిన 14 ఇతర ఉపగ్రహాలను కక్ష లోకి […]

సైబర్ బాధితుల కోసం – ‘సి-మిత్ర’తో ఇంటి నుంచే FIR

ప్రస్తుత  డిజిటల్ యుగంలో ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు వంటి సైబర్ బాధితుల కోసం ‘సి-మిత్ర’ ద్వారా ఎఫ్ఐఆర్​ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తిచేసేలా చర్యలు ప్రారంభించారు. బాధితులకు ‘సి-మిత్ర’ బృందమే స్వయంగా ఫోన్ చేసి, వివరాలు సేకరించి, ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్ కొరియర్ ద్వారా పంపించాలి.

మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఈ ఏడాది జనవరిలో 20 వేల ఉద్యోగుల తొలగిస్తున్నారా?

ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్, ఎక్స్‌బాక్స్ , గ్లోబల్ సేల్స్ విభాగాల్లో లేఆఫ్స్‌ జరగనున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ వాదనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో,ఆ ఊహాగానాలు పూర్తిగా అబద్దమని మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ షా సోషల్ మీడీయా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “100 శాతం కల్పితం / ఊహాజనితం / తప్పు” అనే బదులిచ్చారు.

పుట్టుకతో అంధులుకు సాధారణ కంటి కంటే పవర్‌ఫుల్‌ చూపు!

కాలిఫోర్నియాకు చెందిన న్యూరోటెక్నాలజీ సంస్థ ఎలోన్ మస్క్ న్యూరాలింక్ అంధులకు శుభవార్త చెప్పింది. ‍ న్యూరాలింక్‌తో పుట్టుకతో అంధులైన వారికి సైతం 2026లో మొదటి మానవ పరీక్షలతో కళ్లు తెప్పించే దిశగా ప్రధాన చర్యలు తీసుకుంటోంది. దృష్టిని పునరుద్ధరించే లక్ష్యంతో న్యూరాలింక్ మెదడు చిప్ అయిన బ్లైండ్‌సైట్ సెప్టెంబర్ 2024లో US FDA నుండి ‘బ్రేక్‌త్రూ డివైజ్‌’ హోదాను పొందింది. 2026 ప్రారంభంలో న్యూరాలింక్ పూర్తిగా అంధులకు పరిమిత దృష్టిని అందించే లక్ష్యంతో బ్లైండ్‌సైట్ మొదటి మానవ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON