loader

అమెరికా గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణకు అత్యంత శక్తివంతమైన క్షిపణి భద్రతా వ్యవస్థ ‘గోల్డెన్ డోమ్’ ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం ఏంటంటే.. శత్రు క్షిపణులను వెంటనే గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని మధ్యలోనే ఆకాశంలోనే నాశనం చేయడం. మొత్తం వ్యవస్థను నిర్మించడానికి దాదాపు 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సమాచారం.

రోదసిలో సూపర్‌ కంప్యూటర్‌

ఇప్పటివరకు ఏ దేశమూ కూడా రోదసిలో సూపర్‌ కంప్యూటర్లను ఏర్పాటుచేయలేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా చైనా దీనిని ఆవిష్కరించబోతున్నది. ఏఐ తో పనిచేసే 12 శాటిలైట్స్‌ను రోదసిలోకి పంపి.. ఈ శాటిలైట్స్‌ కూటమితో అత్యంత శక్తివంతమైన సూపర్‌కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను సృష్టించబోతున్నది. చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీ కార్పొరేషన్‌ చేపట్టిన ‘స్టార్‌ కంప్యూటింగ్‌’ ప్రోగ్రామ్‌కు సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్‌ అయ్యిందని చైనా వెల్లడించింది.

5జీ తరంగాలతో ఆరోగ్యానికి ముప్పు లేదు

5జీ టెక్నాలజీ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పక్షులకు హానికరమని, మానవుల మెదళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని అనుమానాలు ఉండేవి. ఇవన్నీ అపోహలేనని, 5జీ తరంగాలతో మానవులకు ఎలాంటి హానీ లేదని, జర్మనీకి చెందిన కన్‌స్ట్రక్టర్‌ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం రూఢీ అయ్యింది. మానవ చర్మ కణాలను అత్యంత శక్తివంతమైన 5జీ తరంగాల తాకిడికి గురిచేయగా, మానవుల్లో జన్యు వ్యక్తీకరణ, మిథైలేషన్‌ ప్రొఫైల్‌లో ఎలాంటి మార్పులు రాలేదని సైంటిస్టులు గుర్తించారు.

డిజిటర్‌ రూపీ శకం మొదలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకొచ్చిన డిజిటల్‌ రూపీ ఇది మనదేశంలో డబ్బు వాడకాన్ని పూర్తిగా మార్చేయబోతున్నది.. డిజిటల్‌ రూపీతో మరో ముందడుగు వేయనున్నది. డిజిటల్‌ రూపీ అంటే ఆర్బీఐ తయారుచేసిన ఒక డిజిటల్‌ డబ్బు. ఇది కరెన్సీ లాంటిదే! దీని విలువ కూడా మన కరెన్సీతో సమానమే!అంటే 1 డిజిటల్‌ రూపీ 1 రూపాయికి సమానం. కాకపోతే మన ఫోన్లో ఉంటుంది. ఈ డబ్బును ఆర్బీఐ నేరుగా ఇస్తుంది. బిట్‌ కాయిన్‌లాంటి ప్రైవేట్‌ కరెన్సీలతో […]

ఏఐతో జాబ్స్ పోవడం పక్కా

ఫ్రీలాన్స్ మార్కెట్ ప్లేస్ ఫైవర్ సీఈఓ మిచా కాఫ్మన్ తాజాగా ఏఐ గురించి కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ కాలానికి తగినట్టుగా మార్పు చెందాలని కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలని ఉద్యోగులకు సూచించారు. మనందరం వినడానికి ఇష్టపడని వాస్తవం ఇది. ఏఐతో మీ ఉద్యోగాలకు ముప్పు తప్పదు. నా జాబ్‌కు రిస్క్ పొంచి ఉంది. డిజైనర్, ప్రాడక్ట్ మేనేజర్, డాటా సైంటిస్ట్, లాయర్, కస్టమర్ సపోర్టు రిప్రజెంటేటివ్, సేల్స్‌పర్సన్, ఫైనాన్స్ ఉద్యోగి.. ఇలాంటి వారి జాబ్స్‌కు ఏఐ ముప్పు […]

నకిలీ రూ. 500 నోట్లు.. స్మార్ట్‌ఫోన్‌తో ఇట్టే కనిపెట్టొచ్చు

మార్కెట్లో న‌కిలీ రూ. 500 నోట్లు చెలామ‌ణి అవుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంది. న‌కిలీ నోట్ల‌ను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స‌రికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. MANI (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్) అనే పేరుతో  యాపిల్ స్టోర్‌తో పాటు ప్లే స్టోర్‌లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. కెమెరా ఆన్ చేసి రూ. 500 నోటును స్కాన్ చేయాలి. దీంతో స‌దరు నోట్ అస‌లా.? న‌కిలీనా.? అన్న విష‌యాన్ని యాప్ చెప్పేస్తుంది. ఈ యాప్‌ను […]

భారత నిఘా వ్యవస్థలోకి కొత్త టెక్నాలజీ..

మే 3న మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ టెస్ట్ రేంజ్ నుంచి స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మొదటి విమాన పరీక్షను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భవిష్యత్తులో భారతదేశం గాలి కంటే తేలికైన హై-ఆల్టిట్యూడ్ వ్యవస్థలను నిర్మించడానికి, ఈ ప్రోటోటైప్ ఫ్లైట్ ఒక మైలురాయి అని DRDO చైర్మన్ సమీర్ కామత్ అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీతో భారత సైనిక నిఘా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.

గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవం తెద్దాం.. ముఖేష్ అంబానీ

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో  వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES 2025)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ పాల్గొన్నారు. “నెక్ట్స్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవం భారత్‌లో వచ్చేలా చేద్దాం” అనే థీమ్‌తో కీలక ప్రసంగం చేశారు. ఇది భారతదేశ సాంస్కృతిక, క్రియేటివిటీ, టెక్నాలజీ శక్తిని ప్రదర్శించే అంతర్జాతీయ వేదికగా రూపొందింది. భారతదేశం గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నాయకత్వం వహించగలదని, “ఇది సాఫ్ట్ పవర్ కాదు, రియల్ పవర్” ముకేష్ […]

పబ్లిక్‌లో వద్దేవద్దు

విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాలు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో లభించే ఉచిత వై-ఫైకి చాలామంది బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి సర్వీసులను ఆచితూచి వాడుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్‌ వై-ఫై ఉపయోగించడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడుతుందని ఫ్రీ వై-ఫై నెట్‌వర్క్‌లో కనెక్ట్‌ అయినప్పడు బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వంటి ఆర్థిక లావాదేవీలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయవద్దని సలహా ఇస్తున్నారు. పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌కు సరైన భద్రత ఉండదనీ, ఇవి హ్యాకర్లు, స్కామర్లకు సులభమైన లక్ష్యాలుగా మారతాయనీ […]

స్కైప్‌ సేవలకు మైక్రోసాఫ్ట్‌ స్వస్తి

ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన వీడియో-కాలింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్కైప్‌ మే 5 తర్వాత యూజర్లకు ఈ అప్లికేషన్‌ అందుబాటులో ఉండదని మైక్రోసాఫ్ట్‌ తాజాగా వెల్లడించింది. స్కైప్‌ తన వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవల్ని 2003లో తొలుత ప్రారంభించింది. అప్పట్నుంచీ దాదాపు 2 దశాబ్దాలుగా పాపులర్‌ ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది. దీనిని 2011లో మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. తమ యూజర్ల కమ్యునికేషన్‌ టూల్స్‌ అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ‘స్కైప్‌’కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON