loader

ఏఐతో 140 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం.. పెరగనున్న ఆదాయ అసమానతలు: యూఎన్‌సీడీఏడీ

యూఎన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీడీఏడీ) తెలిపిన వివరాల ప్రకారం ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల (40 శాతం) ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడిన శ్రమపై ఆధారపడిన దేశాలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. ఈ ఏఐ అభివృద్ధిని ప్రపంచమంతటా సమానంగా పంచుకోదు.ఈ అభివృద్ధి కొన్ని సంస్థలకో, లేదా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కేంద్రీకృతం కావచ్చు. ప్రధానంగా అమెరికా, చైనాలు ఈ విషయంలో ముందుండి అసమానతలో మిగతా దేశాలకు హెచ్చరికగా […]

కొంపలు ముంచుతున్న AI.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న నిపుణులు

కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ ప్రజల జీవితాల్లోకి లోతుగా ప్రవేశిస్తున్న తరుణంలో, ఇది మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI సలహాలు పాటిస్తూ మనుషులు, తమ సంబంధాల్ని వదులుకొని, రోబోలకు దగ్గరవుతున్నారనీ, ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు దారితీస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు AI చాట్‌బాట్ సలహాతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. AI తో మాట్లాడుతూ ఉంటే  చక్కగా మాట్లాడుతుంది.మెచ్చుకుంటుంది, సలహాలు ఇస్తుంది. సూపర్ అంటుంది AI బెటర్ […]

టిక్ టాక్‌కు `లైఫ్

చైనాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ టిక్ టాక్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోన్నారు. టిక్‌టాక్‌ను అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే.  యాప్ మాతృ సంస్థ బైట్ డాన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు.  యూఎస్ కంపెనీ జాయింట్ వెంచర్‌గా 50 శాతం వాటాను టిక్ టాక్ మాతృసంస్థలో కలిగి ఉంటుందని నిబంధనను పెట్టారు. గడువు ముగియబోతోన్న నేపథ్యంలో- […]

బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్‌..83,993 4G టవర్లు పూర్తి..

బీఎస్‌ఎన్‌ఎల్ 5జి సేవలను మొదట దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించి, తరువాత దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించవచ్చని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక పునరుద్ధరణ మార్గంలో ఉందని, 2025 మధ్యకాలం నుండి 5జి లాంచ్ వైపు టెలికాం సంస్థ అడుగులు వేస్తుందని అన్నారు.  BSNL ఇప్పుడు 5G ప్రీమియం బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 5G నెట్‌వర్క్ సేవలను […]

ఖరీదెక్కనున్న ఐఫోన్లు

ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకు ఐఫోన్ల ప్రియంకాబోతున్నాయి. ఆయా మాడళ్ల ధరలు 30 శాతం నుంచి 43 శాతం వరకు పెరగనున్నాయి. వీటిలో హై-ఎండ్‌ మాడల్‌ 2,300 డాలర్లు అధికంకాబోతున్నదని ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచూరించింది. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో అత్యధికంగా చైనా లో తయారవుతుండటమే ఇందుకు కార ణం. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 799 డాలర్ల విలువైన ఐఫోన్‌ 16 ధర 1,142 డాలర్లకు చేరుకోనున్నది.

14న రోదసిలోకి ఆరుగురు మహిళలు

జెఫ్‌ బెజోస్‌ నేతృత్వంలోని ఏరోస్పేస్‌ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ ఈ నెల 14న ఆరుగురు మహిళలను అంతరిక్ష పర్యాటకానికి పంపిస్తున్నది. ఈ ప్రయాణం 10 నిమిషాలపాటు ఉంటుంది. గ్లోబల్‌ పాప్‌ ఐకాన్‌ కేటీ పెర్రీ, నాసా మాజీ రాకెట్‌ సైంటిస్ట్‌ అయిషా బోవే, బయోయాస్ట్రోనాటిక్స్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ అమంద ఎన్‌గుయెన్‌, ప్రముఖ పాత్రికేయురాలు గేలీ కింగ్‌, ఫ్యాషన్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఫిలిం నిర్మాత కెరియన్నే ఫ్లిన్‌, జెఫ్‌ బిజోస్‌ ప్రియురాలు, ఎమ్మీ అవార్డ్‌ విజేత లారెన్‌ శాంచెజ్‌ […]

Reliance Jio : ఇంటర్నెట్ వేగంలో ఇదే తోపు!

భారత్ లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ జియో. ఆకాశంలో ఉన్న టెలికాం వినియోగ ధరల్ని నేలపైకి దించింది కూడా జియోనే. అయితే తర్వాత టారిఫ్ ప్లాన్లను పెంచుకుంటూ వస్తోంది. అయినా ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తోంది జియోనే. వేగవంతమైన నెట్‌వర్క్‌లో జియో టాప్ ప్లేస్‌లో ఉంది. ఓక్లా వెబ్‌సైట్ ప్రకారం, జైపూర్ నగరంలో అత్యధికంగా 181.68 Mbps డౌన్‌లోడ్ వేగం ఉంది. కోల్‌కతా రెండో స్థానంలో, అహ్మదాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి. ముంబైలో తక్కువగా 75.75 […]

గూగుల్ ఫొటోస్ కొత్త రూపు ..

మనం తీసుకున్న ఫొటోల్ని అందంగా, సంవత్సరం, నెల, రోజువారీగా అమర్చి పెట్టే యాప్ గూగుల్ ఫొటోస్. ఆ యాప్ కొత్త డిజైన్, కొత్త రూపంలో వస్తోంది. గూగుల్ ఫొటోస్ యాప్ సమూలంగా మారనుంది. కొత్త సమాచారం ప్రకారం, గూగుల్ కొంతమంది యూజర్లకు సర్వే లింక్‌లను పంపింది. అందులో ప్రస్తుత డిజైన్, కొత్త డిజైన్‌ను పోల్చి అభిప్రాయాలను అడిగింది. వాళ్లందరిలో ఎక్కువమంది దేనికి ఓటు వేశారో.. దాని ప్రకారం ఓకే చేయనుంది. దాంతో కొత్త డిజైన్‌లో చాలా మార్పులు […]

సోషల్‌మీడియాను ఊపేస్తున్న జీబ్లీ..

సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్.. ఇప్పుడు ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఓపెన్‌ చేసినా ఫీడ్‌ మొత్తం జీబ్లీ ఫొటోలతో నిండిపోతోంది. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీకికేవలం ఒక గంటలో  10 లక్షలు యూజర్లు యాడ్‌ అయ్యారని ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ వెల్లడించారు. ఈ ఫీచర్‌ను అత్యధికంగా వినియోగించడం వల్ల తమ జీపీయూ (GPU) వ్యవస్థపై అధిక భారం పడుతోందని, అందుకే దీనికి లిమిట్‌ పెడుతున్నామని ఆల్ట్‌మన్‌ ఇటీవల […]

మీడియా ముందుకొచ్చిన వ్యోమగామి సునీతా…

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్‌ విల్‌మోర్‌లు మార్చి 20న భూమికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌‌లో.. భూవాతావరణానికి సర్దుబాటు చేసుకునేలా నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.తాజాగా, ఈ వ్యోమగాములు 12 రోజుల అనంతరం మొదటిసారి బ్యాహ ప్రపంచం ముందుకు వచ్చారు. సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు బాగానే ఉందన్నారు. తమను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు సహకరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌లకు ధన్యవాదాలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON