loader

సూపర్‌బెట్‌ చాంప్‌ ప్రజ్ఞానంద

భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద..సూపర్‌బెట్‌ క్లాసిక్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద తొలిసారి టైటిల్‌ దక్కించుకున్నాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన టోర్నీలో ఈ చెన్నై చిన్నోడు టైబ్రేక్‌ ద్వారా టైటిల్‌ను ఒడిసిపట్టుకున్నాడు. విజేతను నిర్ణయించేందుకు జరిగిన టైబ్రేక్‌లో ప్రజ్ఞానంద..ఫిరౌజాతో గేమ్‌ను డ్రా చేసుకోగా, వాచిర్‌ లాగ్రేవ్‌తో ఫిరౌజా డ్రా చేసుకున్నాడు. ఆఖరి గేమ్‌లో వాచిర్‌ను ఓడించడం ద్వారా ప్రజ్ఞానంద విజేతగా నిలిచి 66 లక్షల ప్రైజ్‌మనీని సొంతం […]

సునీల్ గ‌వాస్క‌ర్‌కు బీసీసీఐ లో ప్ర‌త్యేక‌ బోర్డ్ రూమ్

భారత క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప క్షణం చోటుచేసుకుంది. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గ‌వాస్క‌ర్‌కు బీసీసీఐ అరుదైన గౌరవం అందించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ‘10,000 గవాస్కర్’ పేరిట ఓ ప్రత్యేక బోర్డు రూమ్‌ను ప్రారంభించారు. ఈ గదిని పూర్తిగా గవాస్కర్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించారు.గదినంతా గవాస్కర్ ఫొటోలు, భారత జట్టు విజయాల ట్రోఫీలు అలంకరించబడ్డాయి.

IPL కోసం.. PSLకు హ్యాండిచ్చిన ఫారిన్ ప్లేయర్స్

బీసీసీఐతో విభేదించి ఐపీఎల్‌తో పాటు PSLను ప్రారంభించిన PCB భారత దాడి భయంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను నిలిపివేసిన పీసీబీకి విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్ పంజాబ్ కింగ్స్ తరపున, కుశాల్ మెండిస్ గుజరాత్ టైటాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం, కుశాల్ మెండిస్ కూడా భారతదేశానికి వస్తే, అది పాకిస్తాన్ లీగ్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. దీని వల్ల ఫ్రాంచైజీకి, పీసీబీకి నష్టాలు రానున్నాయి.

నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్‌కు లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను ప్రదానం చేశారు. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ప్రకటలో వెల్లడించింది. గతంలో నీరజ్ చోప్రా భారత సైన్యంలో సుబేదార్‌గా వ్యవహరిచారు.

ఉప్పల్ కు మొండిచెయ్యి

ఐపిఎల్ సీజన్ 2025ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మ ధ్యలోనే నిలిపి వేసింది. అయితే యుద్ధ మేఘాలు తొలగిపోయి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడంతో ఐపిఎల్‌ను తిరిగి నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఆగిపోయే సమయానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇందులో ఒకటి లీగ్ మ్యాచ్ కాగా, మరో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ, తాజా షెడ్యూల్‌లో హైదరాబాద్‌కు ఒక్క మ్యాచ్ కూడా […]

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..ఐపీఎల్ మళ్లీ షూరు

దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా నిలిచిపోయిన ఈ మెగా టోర్నీ మళ్లీ సందడి చేయనుంది. మిగిలిన మ్యాచ్‌ల కోసం క్రికెట్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. మే 17 నుంచి మొదలయ్యే ఈ క్రికెట్ సంబరం జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. కేవలం 17 రోజుల్లోనే మిగిలిన మ్యాచ్‌లన్నీ పూర్తి చేసేలా బీసీసీఐ ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా రెండు డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఉండనున్నాయి. క్రికెట్ అభిమానులకు ఇక […]

వైభవ్‌ సూర్యవంశీ కు నజరానా

ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఆటకు స్టేడియంలో ప్రేక్షకులు, టీవీల ముందు మ్యాచ్‌ను వీక్షించిన కోటానుకోట్ల క్రికెట్‌ అభిమానులే కాదు.. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సైతం ఫిదా అయ్యారు. నిండా 15 ఏండ్లు కూడా నిండని వైభవ్‌.. సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే రికార్డు శతకం సాధించి ఐపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. నితీశ్‌ కుమార్‌.. రాష్ట్రప్రభుత్వం తరఫున వైభవ్‌కు రూ.10 లక్షల నగదు బహుమానం ప్రకటించారు.

నాకు దేశమే ముఖ్యం.. అర్షద్ నదీమ్‌ను ఆహ్వానించడంపై మౌనం వీడిన నీరజ్ చోప్రా..

తన దేశభక్తి గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఏప్రిల్ 25న ఆయన ఓ ప్రకటన విడుదల చేశాడు. అర్షద్ నదీమ్‌కు ఫోన్ చేసినందుకు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని, దీనిని ఎప్పటికీ సహించని చెప్పుకొచ్చాడు. పహల్గామ్ దాడికి ముందే అర్షద్‌కు ఆహ్వానం పంపినట్లు నీరజ్ స్పష్టం చేశాడు. నేను చాలా సంవత్సరాలుగా నా దేశానికి సగర్వంగా సేవ చేస్తున్నాను. ఈ రోజు నా సమగ్రతను ప్రశ్నిస్తున్నారు. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే వారికి నేను వివరించాల్సి రావడం నాకు […]

కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారికి 3 శాతం రిజర్వేషన్లు, ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏకంగా 3 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖ వంటి యూనిఫాం సర్వీసుల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు.

వైశాలికి తొలి విజయం

ఫిడే (International Chess Federation) మహిళల గ్రాండ్‌ ప్రిక్స్‌ సిరీస్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేశ్‌బాబు తొలి విజయం నమోదు చేసింది. ఐదో రౌండ్‌లో తెల్లపావులతో బరిలోకి దిగిన వైశాలి.. బక్తుయగ్‌ (మంగోలియా)ను ఓడించింది. ఈ గెలుపుతో ఆమె టాప్‌-5లోకి దూసుకొచ్చింది. నాలుగు పాయింట్లతో చైనా క్రీడాకారిణి జైనర్‌ అగ్రస్థానంలో ఉండగా తర్వాత నాలుగు స్థానాల్లో భారత్‌కు చెందిన కోనేరు హంపి (3.5), దివ్య దేశ్‌ముఖ్‌ (3.5), వైశాలి (2.5), హారిక (2.5) ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON