మోహ్సిన్ నఖ్వీపై వేటు.. పీసీబీ చీఫ్ను డైరక్టర్ పదవి నుంచి తొలగించనున్న ఐసీసీ
ఆసియా కప్ ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. భారత జట్టు తన చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాలన్న మంకు పట్టుతో ఉన్న నఖ్వీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. అతడిని గట్టిగా మందలించడం లేదా ఐసీసీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం వంటి వాటిలో ఏదో ఒకటి చేయవచ్చని విశ్వసనీయంగా తెలుస్తున్నదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
నేడే విశాఖలో మహిళా ప్రపంచకప్.. భారత అమ్మాయిలు హ్యాట్రిక్ కొడుతారా?
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ పోటీ ఆస్తికరంగా సాగుతోంది. ఈ మెగా టోర్నీలో భారత అమ్మాయిలు రెండు మ్యాచ్లను సొంతం చేసుకుని పూర్తి జోష్లో ఉన్నారు. హ్యాట్రిక్ విజయం సాధించే లక్ష్యంతో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ కీలక మ్యాచ్కు ఏపీలోని విశాఖపట్టణం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైజాగ్లో గురువారం దక్షిణాఫ్రికా, భారత్ తలపడనున్నాయి.
వరల్డ్ కప్ వేళ కీలక నిర్ణయం.. మిథాలీ పేరుతో వైజాగ్ స్టేడియంలో స్టాండ్..!
భారత మహిళల క్రికెట్కు వన్నె తెచ్చిన మిథాలీ రాజ్ కు అరుదైన గౌరవం లభించింది. కెప్టెన్గా చెరగని ముద్రవేసిన ఈ వెటరన్ ప్లేయర్ పేరును స్టాండ్కు పెట్టాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) నిర్ణయించింది. విశాఖపట్టణం స్టేడియంలో అక్టోబర్ 12 భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలోనే మిథాలీ స్టాండ్ ప్రారంభించాలని ఏసీఏ తీర్మానించింది. ఆమెతో పాటు దిగ్గజ క్రికెటర్ రవి కల్పన పేరుతో కూడా ఒక స్టాండ్ను ఓపెన్ చేయనున్నట్టు ఏసీఏ తెలిపింది.
పారా అథ్లెటిక్స్లో భారత్ రికార్డు.. ప్రశంసలు కురిపించిన నీతా అంబానీ
భారత్ ఆతిథ్యమిచ్చిన 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో మన దేశ క్రీడాకారులు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో భారత పారా అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, 22 పతకాల (6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు) సాధించి చరిత్ర సృష్టించారు. పారా అథ్లెటిక్స్ ఘనత “సమ్మిళితం, పట్టుదల, ప్రతిభకు నిదర్శనం” అని నీతా అంబానీ భారత బృందాన్ని ప్రశంసించారు. వారి పట్టుదల, ధైర్యం… మానవ స్ఫూర్తి యొక్క గొప్ప […]
ముగిసిన భారత్ బ్యాటింగ్.. పాకిస్థాన్ లక్ష్యం ఎంతంటే..
ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా భారత మహిళ జట్టు, పాకిస్థాన్ మహిళ జట్టు మధ్య మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్కి దిగింది. పాక్ బౌలర్లు భారత బ్యాటర్ల వికెట్లు తీస్తూ స్కోర్ని కట్టడి చేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్లో హర్లిన్ డియోల్ 46, రిచా ఘోష్ 35, జెమిమా రోడ్రిక్స్ 32, […]
తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం
వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ను ముగించింది. మూడో రోజు 286 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో నెగ్గింది. సెంచరీ హీరో రవీంద్ర జడేజా బంతితోనూ మెరిశాడు. 4 వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో సిరాజ్ 7 వికెట్లు సాధించాడు.
సిరాజ్ సెన్సేషన్! తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలిన వెస్టిండీస్…
అహ్మదాబాద్లో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, 44.1 ఓవర్లలో162 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. సిరాజ్కి తోడు జస్ప్రిత్ బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో రాణించడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది..
నేను బీసీసీఐకి క్షమాపణలు చెప్పలేదు.. చెప్పను : మొహ్సిన్ నఖ్వీ
తాను బీసీసీఐకి ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. బీసీసీఐకి నఖ్వీ క్షమాపణలు చెప్పాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ క్షమాపణలు చెప్పినట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తాను బీసీసీఐకి ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని.. ఎప్పటికీ అలా చేయబోనని.. భారత మీడియా వాస్తవాలతో కాకుండా అబద్ధాలతోనే వృద్ధి చెందుతుందంటూ ఆరోపించారు.ఏసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ వ్యవహరించిన తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం […]