loader

చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి రాసిన లేఖలో, RCB ఫ్రాంచైజీ చిన్నస్వామి స్టేడియంలో 300-350 AI-ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది ప్రజల కదలికలను పర్యవేక్షించడానికి, పెద్ద క్యూ లైన్లు, స్టేడియం ఎగ్జిట్ ప్రాంతాలను కూడా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. స్టేడియంలో AI కెమెరాలను ఏర్పాటు చేసే ఖర్చును తామే భరిస్తామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ (RCB) తెలిపింది. దీని మొత్తం వ్యయం దాదాపు 4.5 కోట్ల రూపాయలు కావచ్చని తెలుస్తోంది.

రాజ్‌కోట్ వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ అలవోక విజయం

రాజ్‌కోట్‌లో భారత్ vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ జరిగిన 2వ వన్డేలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు అలవోకగా చేధించారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ జట్టు 286 పరుగులు సాధించి.. మూడు మ్యాచ్‌ల వన్డే సీరిస్‌ను 1-1తో సమం చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్(131), విల్ యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు సాధించి జట్టు […]

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. అగ్రస్థానంలో కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. నాలుగేళ్ల తర్వాత ఐసీసీ వన్డే బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. తన కెరీర్‌లో మరోసారి నెంబర్ 1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. ఇటీవల వన్డే మ్యాచుల్లో వరుసగా ఐదు 50+ స్కోర్లు సాధించాడు. దీంతో వన్డే ర్యాంకింగ్స్ పట్టికలో కోహ్లీ తన సహచర ఆటగాడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి.. అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ ర్యాంకింగ్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది 11వ సారి. […]

అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేశాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వడోదరలో జరిగిన భారత్- న్యూజిలాండ్ మొదటి వన్డే మ్యాచ్‌లో 25 పరుగులు చేయడంతో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 28 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ విషయంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.. విరాట్ కోహ్లీ, సచిన్‌ కంటే 20 ఇన్నింగ్స్‌లు తక్కువ సమయంలోనే […]

కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్

2026 నూతన సంవత్సరాన్ని టీమిండియా విజయంతో ఘనంగా ప్రారంభించింది. బరోడా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, ఆరంభంలో తడబడినప్పటికీ, సీనియర్ బ్యాటర్ల అనుభవం, యువ ఆటగాళ్ళ పోరాట పటిమతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

బాక్స్‌లోంచి బయటకొచ్చి నిలువెత్తు ఫొటోపై సంతకం.. భారత దిగ్గజాలకు వినూత్న సత్కారం..!

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లకు వడోదరలో వినూత్న సన్మానం జరిగింది.సరికొత్తగా ఆలోచించిన బరోడా క్రికెట్ అసోసియేషన్ ‘రో-కో’ను ‘ఔట్ ఆఫ్ ది బాక్స్‌’ స్వాగతంతో ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ బాక్స్ లోంచి బయటకు వచ్చి.. పూలగుత్తులను స్వీకరించారు.అనంతరం తమ నిలువెత్తు ఫొటోగ్రాఫ్‌ మీద విరాట్, హిట్‌మ్యాన్ సంతకాలు చేశారు.

డీక్లెర్క్ సిక్సర్ల మోత.. ఉత్కంఠ విజయంతో బోణీ కొట్టిన ఆర్సీబీ ..!

డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నడినే డీక్లెర్క్(63 నాటౌట్) సిక్సర్ల మోతతో ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు. 65కే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని ఆదుకున్న ఈ సఫారీ చిచ్చరపిడుగు.. ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. దాంతో.. ఓటమి ఖాయమనుకున్న మంధాన సేన అనూహ్యంగా 3 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

ఐదో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపు… యాషెస్ సిరీస్ కైవసం

యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఐద టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి 4-1 తేడాతో యాషెస్ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు ఆస్ట్రేలియా 31.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. యాషెస్ సిరీస్‌లో మిచెల్ స్టార్క్ 31 వికెట్లు తీయడంతో పాటు 156 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

అగ్గిరాజేసిన ఆ వివాదం…ఐపీఎల్ 2026పై నిషేధం..?

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (IPL) కి బంగ్లాదేశ్‌లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. అయితే, 2026 ఐపీఎల్ సీజన్ ప్రసారాలు బంగ్లాదేశ్‌లో నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ, దౌత్యపరమైన విభేదాలు క్రికెట్ మైదానానికి పాకడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల కావడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది.

జట్టులోంచి తీసేస్తే నేనేం చేస్తా? – బంగ్లాదేశ్‌ పేసర్ ముస్తాఫిజుర్ రెస్పాన్స్

ఐపీఎల్ 2026కు దూరం కావడంపై బంగ్లాదేశ్‌ పేసర్ ముస్తాఫిజుర్ రెహమన్ స్పందించాడు. ‘మిమ్మల్ని జట్టులోంచి తీసేస్తే మీరు ఇంకా ఏమి చేయగలరు?’ అంటూ బంగ్లా మీడియాలో స్పందించాడు. ప్రస్తుతం అతడి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ, బంగ్లా పేసర్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్‌ ఫ్రాంఛైజీని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON