loader

పాకిస్థాన్ క్రికెటర్లకు బిగ్ షాక్ !

టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు ఘోర వైఫల్యం ఆ దేశ క్రికెట్ బోర్డును తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. టోర్నీలో సెమీఫైనల్ కూడా చేరలేకపోయిన జాతీయ జట్టు ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలు చేపట్టింది. తాజా రిపోర్టుల ప్రకారం, జట్టులోని ప్రతి క్రీడాకారుడికి 5 మిలియన్ల పాకిస్థానీ రూపాయల ( భారత కరెన్సీలో సుమారు రూ. 16.28 లక్షలు) జరిమానా విధించాలని బోర్డు నిర్ణయించింది. ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతుండటంతో ఆటగాళ్లకు బుద్ధి […]

విండీస్ పై గెలుపు… సెమీ ఫైనల్ కు భారత్

టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య  జరిగిన మ్యాచ్ లో విండీస్ పై భారత్ గెలిచి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. సంజూ శామ్సన్ భారీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సంజూ 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. భారత జట్టు 19.2 ఓటర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

ఉతికేస్తున్న పాక్ ఓపెనర్లు.. తొలిసారి పవర్ ప్లేలో భారీ స్కోర్..!

సెమీస్‌ బెర్తుపై కన్నేసిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభిచ్చారు. భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్ ఫర్హాన్(65 నాటౌట్) చెలరేగుతున్నాడు. మరో ఎండ్‌లో ఫఖర్ జమాన్(50 నాటౌట్) సైతం దంచేస్తున్నాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ శనకు చుక్కలు చూపిస్తూ.. వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఫర్హాన్ బౌండరీ కొట్టగా ఆ ఓవర్లో 13 రన్స్ పిండుకున్నారు. వీరిద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ కోల్పోకుండా 64 రన్స్ చేసింది. 12 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 133 రన్స్ […]

చ‌రిత్ర సృష్టించిన జ‌మ్మూక‌శ్మీర్.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవ‌సం

జ‌మ్మూక‌శ్మీర్ క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీని మొట్ట మొద‌టి సారి గెలుచుకున్న‌ది. క‌ర్నాట‌క‌తో హుబ్లీలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన జ‌మ్మూక‌శ్మీర్ జ‌ట్టుకు రంజీ ట్రోఫీ ద‌క్కింది. జేకే బ్యాట‌ర్లు క‌మ్రాన్ ఇక్బాల్‌, సాహిల్ లోత్రాలు.. క‌ర్నాట‌క బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నారు. ఆ ఇద్ద‌రూ అయిదో వికెట్ అజేయంగా 197 ర‌న్స్ జోడించారు.

కివీస్ ఓటమితో పాకిస్థాన్ ఖుష్!

తాజా ఓటమితో కివీస్ సెమీఫైనల్ అవకాశాలు అత్యంత సంక్లిష్టం అయ్యాయి. సూపర్ 8లో ఒక్కో విజయం, ఓటమి (మరో మ్యాచ్ రద్దు)తో న్యూజిలాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ ఫలితంతో పాకిస్థాన్ సంతోషంగా ఉంది. కివీస్ ఓడడంతో పాక్​ సెమీస్​ రేస్​లో ఉంది. రేపు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్​లో పాక్ భారీ తేడాతో నెగ్గితే సెమీస్​కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం కివీస్ రన్​రేట్ +1.390 (3 పాయింట్లు)తో ఉండగా, పాకిస్థాన్ -0.461 […]

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం

సూపర్ 8లో ఇంగ్లాండ్ హ్యాట్రిక్ నమోదు చేసింది. తాజాగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో గ్రూప్ 2లో సెమీస్ రేసు ఇంకా ఆసక్తికరంగా మారింది. కివీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్​ను ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లో ఛేదించింది. టామ్ బంటన్ (33 పరుగులు) రాణించాడు. విల్ జాక్స్ (32 పరుగులు), రెహాన్ అహ్మద్ (19 పరుగులు, 7 బంతుల్లో) చివర్లో మెరుపులు మెరిపించడంతో ఉత్కంఠ పోరులో ఇంగ్లిష్ […]

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో టీమ్ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 257 పరుగుల భారీ ఛేదనలో జింబాబ్వే ఓనర్లన్నీ ఆడి 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితం అయ్యింది. బ్రియాన్ బెన్నెట్ (97* పరుగులు) భారీ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. టీమ్ఇండియా బౌలర్లలో అర్షదీప్ 3, వరణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ బెర్త్ ఫిక్స్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చగా, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది పోరాటం వృధా అయింది.

దక్షిణాఫ్రికా హిట్టర్‌తో రీల్‌.. ఇన్‌ఫ్లూయెన్సర్‌కు నెటిజన్ల బెదిరింపులు..!

సూపర్ 8 తొలి మ్యాచ్‌లో భారత జట్టు దారుణ ఓటమిని అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. అహ్మదాబాద్‌లో టీమిండియా ఓటమిలో కీలకమైన డేవిడ్ మిల్లర్ తో రీల్ చేసింది తను. మ్యాచ్ అనంతరం మిల్లర్‌తో మైదానంలో చేసిన రీల్‌ను సోషల్ మీడియలో పోస్ట్ చేసిన ప్రిన్సీ.. ‘మిల్లర్ అద్భుతమైన బ్యాటర్ కదా.. ’ అని క్యాప్షన్ పెట్టింది. ఇంకేముంది.. కొందరు అమెను ట్రోల్ చేస్తూ.. బెదిరింపులకు దిగారు. అత్యాచారం చేస్తామని, బొండంలా ఉన్నావని.. ఇలా బాడీషేమింగ్‌తో బాధ పెట్టారు. ఇవన్నీ […]

అభిమానుల ప్రేమకు ప్రతీకగా కొత్త లోగో.. గరుడ, కిరీటం, ఏనుగు బొమ్మలు

ఐపీఎల్‌లో ప్రతిసారి గట్టి పోటీనిచ్చే లక్నో సూపర్ జెయింట్స్ కొత్త లోగో ఉత్తరప్రదేశ్.. లక్నో పట్టణ విశిష్టతను, స్ఫూర్తిగాథను చాటేలా సరికొత్తగా.. అభిమానులకు అమితంగా నచ్చేలా రూపొందించారు. తాజా లోగోలో శక్తివంతమైన గరుడు, కిరీటం, ఏనుగు బొమ్మలు ఉన్నాయి. గరుడ (గరుత్మంతుడు) చిహ్నం ధైర్యానికి ప్రతీక. కిరీటం విషయానికొస్తే దర్పం, బాధ్యతకు ప్రతీక కొత్త లోగుకు ఏనుగు బొమ్మ గుండెతో సమానం. బలం, తెలివి, ఓపిక, ఐక్యత.. ఈ లక్షణాలకు ప్రతిరూపమే ఏనుగు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON