లిక్కర్ స్కామ్లో సీఎం కుమారుడికి ముట్టిన 250 కోట్లు
చత్తీస్ఘడ్లో భారీ లిక్కర్ స్కామ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేశ్ భగల్ కుమారుడు చైతన్యకు సుమారు రూ.250 కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది. తన వాటా కింద ఆ మొత్తం అందినట్లు అవినీతి నిరోధక శాఖ తన ఛార్జిషీట్లో పేర్కొన్నది. లిక్కర్ స్కామ్లో చైతన్య భగేల్ కీలక పాత్ర పోషించినట్లు ఆ ఛార్జీషీట్లో తెలిపారు. సిండికేట్ ద్వారా వచ్చిన డబ్బును చైతన్య నమ్మకస్తులతో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

