loader

లిక్క‌ర్ స్కామ్‌లో సీఎం కుమారుడికి ముట్టిన 250 కోట్లు

చ‌త్తీస్‌ఘ‌డ్‌లో భారీ లిక్క‌ర్ స్కామ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ కుమారుడు చైత‌న్య‌కు సుమారు రూ.250 కోట్లు ముట్టిన‌ట్లు తెలుస్తోంది. త‌న వాటా కింద ఆ మొత్తం అందిన‌ట్లు అవినీతి నిరోధ‌క శాఖ త‌న ఛార్జిషీట్‌లో పేర్కొన్న‌ది. లిక్క‌ర్ స్కామ్‌లో చైత‌న్య భ‌గేల్ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆ ఛార్జీషీట్‌లో తెలిపారు. సిండికేట్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బును చైత‌న్య న‌మ్మ‌క‌స్తుల‌తో త‌ర‌లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కెసిఆర్ కు ఇష్టం లేదు కావొచ్చు – మంత్రి శ్రీధర్

గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడులు, తద్వారా యువతకు లభించే ఉద్యోగ అవకాశాలు కేసీఆర్‌కు ఇష్టం లేనట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా అభివృద్ధిని అడ్డుకోకుండా, రాష్ట్ర ప్రగతికి తోడ్పడేలా సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్

గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘనవిజయం సాధించింది.50 సీట్లలో 30 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు 5 సీట్లు గెలుచుకున్నారు. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎండీపీ) రెండు స్థానాల్లో గెలుపొందగా, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), రివల్యూషనరీ గోన్స్ పార్టీ (ఆర్‌జీపీ) ఒక్కో సీటు చెప్పున గెలుచుకున్నాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంజీపీతో,  జీఎఫ్‌పీ పొత్తుతో కాంగ్రెస్ […]

ఓటమిలో నిలిచినవారికే గుర్తింపు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. అమరావతి వేదికగా “పదవి-బాధ్యత” పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవి చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదని, మనం నిర్వహించే బాధ్యత మాత్రమే గొప్పదని స్పష్టం చేశారు. జనసేనను కేవలం ఎన్నికల కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీగా చూడవద్దని పవన్ సూచించారు. దేశ సేవ కోసమే దీనిని స్థాపించినట్లు వెల్లడించారు.

వైసీపీని పర్మినెంట్‌గా అధికారంలోకి రాకుండా చేస్తా.. అవసరమైతే షర్ట్ మడతపెడతా..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీని పర్మినెంట్‌గా అధికారానికి దూరం చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ శత్రువులు కాదన్న పవన్ కళ్యాణ్.. విధానాలతోనే తనకు సమస్య అని అన్నారు. ఆకు రౌడీలను ప్రోత్సహించే పార్టీని గుర్తించనన్న పవన్ కళ్యాణ్.. విధానాలపై ప్రశ్నిస్తే ప్రోత్సహిస్తానన్నారు. అలాగే అరాచకాలు మితిమీరి ఇక తప్పదని అనుకుంటే ఆఖరి అస్త్రంగా షర్ట్ మడతపెడతామంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆ పార్టీ ఓ రౌడీ సమూహంలా కనిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు […]

కేసీఆర్ కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

రాష్ట్రంలోని నదీ జలాలపై చర్చిద్దామని.. అందుకోసం అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా జల దోపిడి జరిగిందని ఆయన విమర్శించారు. మూడు జిల్లాలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ ఆని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు – రంగారెడ్డికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేవని ఆయన పేర్కొన్నారు.

తోలు తీస్తాం.. ఇవాల్టి దాక కథ వేరు.. రేపట్నుంచి వేరు.. కాంగ్రెస్‌ సర్కార్‌కు కేసీఆర్‌ వార్నింగ్‌

పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్‌ అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని.. ఇక తప్పనిసరి పరిస్థితి అని బయల్దేరానని తెలిపారు. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతానని పేర్కొన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం.. బహిరంగ సభలు పెడతామని తెలిపారు. వాటికి తానే స్వయంగా హాజరవుతానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో నిష్క్రియ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇవాల్టి దాకా వేరు కథ.. రేపట్నుంచి వేరే.. […]

నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీ: కేసీఆర్‌

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు. నన్ను దూషించడం, నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు.  పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు .అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు […]

బీఆర్ఎస్ సమావేశం ప్రారంభం.. కాంగ్రెస్ పాలన, జలాల అంశంపై కీలకంగా చర్చ!

తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభాపక్ష (BRSLP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం ప్రారంభమైంది.

విషెస్ తెలిపిన పవన్, షర్మిల… వైసీపీ క్యాడర్ భారీ సెలబ్రేషన్స్,

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జన్మదినం(డిసెంబర్ 21) సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు భారీగా సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. . ‘‘ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్టు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON