ఆ అక్రమ నిర్మాణంలో సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్రెడ్డి : హరీశ్రావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతున్నదని, ముందుగా గోదావరి బనకచర్లతో జలదోపిడీకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్.. నష్టనివారణ కోసం గోదావరి నల్లమల సాగర్కు మార్చుకుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు చెప్పారు. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే, పాత్రధారి రేవంత్ రెడ్డి అని చెప్పారు. కత్తి చంద్రబాబుదే అయినా పొడిచేది మాత్రం రేవంత్రెడ్డి అన్నారు. అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నడా.. లేదంటే చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నడా నాకైతే అర్థమైతలేదు’ అని వ్యాఖ్యానించారు.

