బంగాల్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు సమాచారం సేకరించేందుకు బంగాల్కు వచ్చారు. ఎన్నికలు రాగానే దుశాసన, దుర్యోధనలు ఇద్దరు కనిపిస్తారు. ఈరోజు వచ్చి మమతా బెనర్జీ భూమి ఇవ్వట్లేదని వారు చెబుతున్నారు. సరిహద్దుల్లో కంచె నిర్మించేందుకు పెట్రాపోల్, అండాల్లో తమ ప్రభుత్వం భూమిని కేటాయించిందని, 14 ఏళ్ల క్రితం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తు చేశారు.

