loader

బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం

బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం బళ్లారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జూర్‌ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తుముకూరులోని ఓ ఫాం హౌస్ లో ఆత్మహత్య యత్నం చేసిన ఎస్పీ. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారమే ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా.. ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే సస్పెండ్ […]

ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చు.. సీఎం రేవంత్ రెడ్డికి తలసాని సవాలు

హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్‌ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారని తలసాని ఆరోపించారు. సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూడమని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.

దుర్గం చెరువులో నాకు గజం జాగా కూడా లేదు: కొత్త ప్రభాకర్ రెడ్డి

దుర్గం చెరువు ఆక్రమించడంపై బిఆర్ఎస్ ఎంఎల్ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. దుర్గం చెరువులో తాము ఐదు ఎకరాల భూమి కబ్జా చేశానని కేసు పెట్టారని, అందులో మాకు గజం జాగా కూడా లేదని, ప్రభుత్వానికి కూడా గజం జాగా లేదన్నారు. తనపై కక్షతో కేసు పెట్టారని, బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయని వివరించారు. దుర్గం చెరువులో తనకు . భూమి లేదని, ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా […]

బళ్లారిలో టెన్షన్ టెన్షన్.. ఎమ్యెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం..

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్దే బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి సన్నిహితుడు సతీశ్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే, ఈ కాల్పుల నుండి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు ఉపన్యాసాలు ఇస్తారా: కేటీఆర్

నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఅర్ఎస్‌కు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘మేము మీ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి. చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా. మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా. సుంకిశాల ఎలా కూల్చామో చూపిస్తారా. వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో […]

రెండు పార్టీలు ఒక్కటై మనపై కత్తులు దూస్తున్నాయి: కెటిఆర్

గెలుపోటములు తాత్కాలికం.. ప్రజల గుండెల్లో మాజీ సిఎం కెసిఆర్ శాశ్వతం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం ప్రారంభమైందని అన్నారు. తెలంగాణ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్ఎస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. యూరియా కోసం రైతులు చలికి వణుకుతూ క్యూలైన్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు ఒక్కటై మనపై కత్తులు దూస్తున్నాయని, మనల్నితుదముట్టించేందుకు రెండు పార్టీలు […]

ZPTC బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం

అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో వైసిపి జడ్ పిటిసి బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రతాప్ రెడ్డి తలపై కర్రలు, రాడ్లతో టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైసిపి నేతలపై టిడిపి నేతలు దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. టిడిపి నేతల దాడికి నిర‌స‌న‌గా వైసిపి నేత‌ల ధ‌ర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న వారిపై కూడా టిడిపి నేతలు దాడి చేశారు. బోగాతి ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్రంగా […]

రాహుల్ గాంధీ ‘రాముడి లాంటి వారు’.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం

రాహుల్ గాంధీ .. శ్రీరాముడు చేసిన పనులనే చేస్తున్నారని..పీడితులకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయడమే శ్రీరాముడి లక్ష్యమని పేర్కొన్న మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నానా పటోలే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారనికి కారణం అవుతున్నాయి. వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. ఇది హిందూ ధర్మానికి జరిగిన అవమానంగా బీజేపీ అభివర్ణించింది. రాహుల్ గాంధీ అయోధ్య రామాలయాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదన్న ప్రశ్నకు సమాధానంగా పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం విఫలం : వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. 2025లో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని విమర్శించారు. చిన్నారులు, మహిళలు, యువతులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. బెల్టు షాపులు, మద్యం దుకాణాలను విచ్చలవిడిగా నెలకొల్పి ప్రజల జీవితాలతో చెలగాటమాడాయని పేర్కొన్నారు. డీజీపీ విడుదల చేసిన వార్షిక నివేదికలో నేరాల సంఖ్య పెరిగిపోయాయని వెల్లడించడం ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పనితీరును తెలియజేస్తుందని వెల్లడించారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్‌గా హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను ప్రకటించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉప నేతలుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON