loader

డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు: రష్మిక

సోషల్ మీడియా లో హీరోయిన్స్‌పై వచ్చే ట్రోల్స్, విమర్శలు, వ్యక్తిగత దూషణలుపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బహిరంగంగా స్పందించింది. తనపై వచ్చే ట్రోల్స్‌లో చాలావరకు ఉద్దేశపూర్వకమైనవే. కొందరు వ్యక్తులు, గుంపులు డబ్బులు తీసుకుని మరీ సోషల్ మీడియాలో తన గురించి నెగటివ్ పోస్టులు పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. ఇలా కావాలనే తన ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది.

బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరైన మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కార్యాలయానికి హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఆమె హైదరాబాద్‌లోని ఈడీ రీజినల్ కార్యాలయానికి చేరుకొని విచారణాధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో పలు సినీ, క్రీడా ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడంతో, దర్యాప్తు వేగవంతం అయ్యింది.

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు థ్యాంక్స్‌ : ఎన్టీఆర్

ట్విట్టర్‌లో చేసిన పోస్టులో ఎన్టీఆర్ ఇలా అన్నారు:”వార్‌ 2″ విడుదల నేపథ్యంలో కొత్త జీఓ ఆమోదించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్‌ గారికి కృతజ్ఞతలు.”ఈ ట్వీట్‌తో తారక్‌ ఆనందాన్ని పంచుకున్నారు. తన సినిమా కోసం ప్రభుత్వ సహకారం లభించడం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, సినిమాల పెద్ద ఎత్తున విడుదలకు తోడ్పడుతుంది.

రామ్‌గోపాల్ వర్మ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ముగ్గురి ఫొటోలను మార్ఫింగ్ చేసి కించపరిచారని వర్మపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి నోటీసులు అందుకున్న వర్మ.. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. గత విచారణ సమయంలో సెల్ ఫోన్ తమకు స్వాధీనం చేయాలని పోలీసులు అడిగితే.. తాను ఫోన్ తీసుకురాలేదని వర్మ సమాధానం చెప్పారు. అయితే, ఈసారి మాత్రం పోలీసులు వర్మను వదల్లేదు. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వర్మ సెల్ […]

ఇది బీహార్ బాబూ! నమో భారత్ రైలును సైతం నార్మల్ కోచ్‌గా మార్చారు

వందే భారత్, నమో భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూర్చోవడం అంటే విలాసం, సౌకర్యం, సినిమా ప్రయాణం అని అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నమో భారత్ ఎక్స్‌ప్రెస్ రైలకు సంబంధించినది. ఇందులో లగ్జరీ సీట్ల కంటే ఎక్కువ మంది రైలులో నిలబడి, తలుపుల దగ్గర వేలాడుతూ కనిపిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే, సీటు రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తులు కూడా నిలబడి ప్రయాణిస్తున్నారు.

శ్రీదేవి

రీదేవి (ఆగస్టు 13, 1963-24 ఫిబ్రవరి 2018) భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము,అభినయం,నటన లో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది.  ఆమె తన నట జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణై (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టినది శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయకిగా కొనసాగింది. దాదాపు అందరు అగ్ర […]

కూలీ, వార్ 2 టికెట్ రేట్లపై ఫ్యాన్స్ ఫైర్

ఈవారం అగస్ట్ 14న రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షన్లుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల టికెట్ ధరలు అనవసరంగా పెంచడం పై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రజినీకాంత్, నాగార్జున కూలీ చెన్నైలో టికెట్ ధర 150‑200, హైదరాబాద్‌లో అది 400, ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 హిందీ వర్షన్ కు 180‑250 టికెట్ ధర ఉండగా, తెలుగు డబ్బింగ్ కోసం 400‑500 వరకు […]

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌కు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. నేడు ఆగస్టు 12న ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గతేడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీ ఈరోజు ఉదయం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మను ఆయన తరఫు న్యాయవాది సమక్షంలో విచారిస్తున్నారు

ఆయన్ని రెమ్యూనరేషన్‌తో కొనలేమన్న-త్రివిక్రమ్

ఆర్. నారాయణమూర్తి కొత్త చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం సుదీర్ఘమైనది. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. తన సినిమాల్లో రాజు ఆయనే, సైనికుడూ ఆయనే. నా సినిమాలో ఓ పాత్రకు నారాయణమూర్తిని తీసుకోవాలనుకున్నాను. కానీ రెమ్యునరేషన్‌తో ఆయన్ని కొనలేమని అర్ధమైంది. ఆయనొక శక్తి’ అని త్రివిక్రమ్ కొనియాడారు.

ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌..

భీమవరంలో జరిగిన ఈవెంట్‌కు నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో వచ్చిందంటూ వీడియోలు బాగా వైరలయ్యాయి. దీనిపై నిధి అగర్వాల్‌ ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిది. అయితే దానిని ఏర్పాటు చేసే విషయంలో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నా కోసం ఎలాంటి వాహనం ప్రత్యేకంగా పంపలేదు. డ్రైవర్ తన తప్పును ఒప్పుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రభుత్వ వాహనం ప్లేట్‌ పెట్టుకున్న […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON