loader

విద్యార్థులకు అక్కినేని నాగార్జున భారీ కానుక – రూ.2 కోట్లు విరాళం

గుడివాడ ఏఎన్నార్ కాలేజీ విద్యార్థులకు కింగ్ నాగార్జున పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు అక్కినేని కుటుంబం తరఫున కాలేజీలో స్కాలర్‌షిప్‌ల ఏర్పాటు కోసం ఏకంగా రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. గుడివాడలోని ఏఎన్నార్ కాలేజీలో జరుగుతున్న డైమండ్ జూబ్లీ (వజ్రోత్సవ) వేడుకలకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ ఆయనకు చదువు అంటే ప్రాణం. తాను చదువుకోలేకపోయినా, వేల మంది చదువుకోవాలని ఆయన కోరుకున్నారు అక్కినేని నాగేశ్వరరావుకు చదువుపై ఉన్న […]

2025లో ట్రెండ్ సెట్టర్​గా చెర్రీ సాంగ్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మరోసారి స్టార్ పవర్‌తో అదరగొట్టారు. ’పెద్ది’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ’చికిరి చికిరి’ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ఇప్పుడు  పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండీగా మారింది. నెటిజన్లు ఇప్పటికే ఈ పాటకు వేలల్లో రీల్స్​ చేశారు. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఒక్క తెలుగు వర్షన్ లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటగా, ఐదు భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్లకు […]

కల్యాణ్ వర్సెస్ తనూజ..హోరా హోరీగా గ్రాండ్ ఫినాలే ఓటింగ్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి ఈ షో ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. పేరుకు ఐదుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నా టైటిల్ రేసు మాత్రం ప్రధానంగా ఇద్దరి మధ్యే ఉంది. వాళ్లిద్దరే పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి. ఈ క్రమంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లైన్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఓటింగ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. కాబట్టి ఏవైనా మార్పులు సంభవించే […]

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ-పరిపూర్ణ కళాకారుడిని గుర్తుచేసుకున్నాం

ఇవాళ పరిపూర్ణ కళాకారుడిని గుర్తు చేసుకుంటున్నామని, సినీ చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు మన తెలుగు ప్రజలందరికీ గౌరవం అని భావిస్తున్నానని బండారు దత్తాత్రేయ తెలిపారు. బాలు ఓ కులం, ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని,  సంగీతానికి ప్రాంతం, భాషా బేధం లేదని, ఎస్పీ అభిమానుల కోరిక మేరకు విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించిన మంత్రి సంగీత ప్రపంచ రారాజు బాలు […]

రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ 

బహుముఖ ప్రజ్ఞతో తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గాన గంధర్వుడి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అతిథులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. సినిమాల్లో బాలు తొలి పాట పాడిన రోజుని పురస్కరించుకొని ఇవాళ విగ్రహావిష్కరణ చేపట్టారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్‌ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు.టన్ను కాంస్యంతో దాదాపు 3 నెలలపాటు శ్రమించి 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని ఏపీలోని తూర్పు […]

మాజీ భార్యపై హీరో దిలీప్‌ ఫైర్.. కుట్ర చేసి జైలుకు పంపించిందని ఆరోపణలు!

మలయాళ హీరో దిలీప్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఒక హీరోయిన్‌ను వేధించిన కేసులు అతడిపై 2017లో నమోదైన ఒక కేసులో, కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా తన మాజీ భార్య మంజు వారియర్‌పై దిలీప్ షాకింగ్ కామెంట్స్ దాడి కేసులో తనను ఇరికించడానికి ఆమె కుట్ర చేసిందని ఆరోపించాడు.‘‘కేసులో కుట్ర ఉంది అని మొదట సూచించింది మంజు వారియరే.ఆ తర్వాతే నాపై కుట్ర మొదలైంది’’ అని చెప్పాడు.మంజు తప్పుడు అభియోగాలు మోపడానికి స్క్రిప్ట్ తయారు […]

లక్ష మంది ఫ్యాన్స్ ఎంట్రీస్‌తో.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ దేఖ్‌లేంగే సాలా సాంగ్ లాంచ్‌

పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ దేఖ్‌ లేంగే సాలా నెట్టింటిని షేక్ చేస్తోంది. మేకర్స్‌ మొట్టమొదటి సారి లక్ష మంది ఫ్యాన్స్ ఎంట్రీస్‌తో దేఖ్‌లేంగే సాలా సాంగ్ లిరిక్‌ షీట్‌ను లాంచ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటను భాస్కర బట్ల రాయగా.. విశాల్‌ దడ్‌లానీ పాడాడు.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ప్రభాస్ మేనియా.. ఓవర్సీస్‌లో ‘ది రాజా సాబ్’ దూకుడు!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ  ‘ది రాజా సాబ్‌’పై ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న‌ విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్స్‌కు సంబంధించి సుమారు నెల రోజుల ముందే యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌లైన వెంట‌నే ‘ది రాజా సాబ్’ ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే లక్ష డాలర్ల మార్క్‌ను దాటిపోయి దూసుకుపోతున్న‌ట్లు ట్రేడ్ […]

సూపర్ స్టార్ రజినీకాంత్.. కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం.

తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ..శనివారం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రజినీకాంత్ భార్య లతా, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు లింగ రాజా, యాత్ర రాజాతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను ప్రజలకు ఈఓ వెంకయ్య చౌదరి అందజేశారు.

చలో ఢిల్లీ హైకోర్టు – సెలబ్రిటీలంతా ఆ కోర్టుకే ఎందుకెళ్తున్నారో

భారతదేశంలో సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ రక్షణకు  ఢిల్లీ హైకోర్టు మొదటి ఎంపికగా మారింది. బాలీవుడ్ స్టార్లు సెలబ్రిటీలు, తమ చిత్రాలు, స్వరాలు,ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు అనధికారిక వాణిజ్య ఉపయోగానికి వ్యతిరేకంగా ఈ కోర్టులోనే పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. AI డీప్‌ఫేక్‌లు, మోర్ఫింగ్‌లు,  వంటి ఆధునిక సవాళ్లకు వేగవంతమైన నిషేధాజ్ఞలు జారీ చేయడంతో ఈ కోర్టు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సల్మాన్ ఖాన్, పవన్ కల్యాణ్ కేసుల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కు మూడు రోజుల్లోపు యాక్షన్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON