వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో గంధ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణితో కలిసి మస్తాన్ వలీని దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ గంధోత్సవానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు.
కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ సిజరా పఠనం నిర్వహించి మస్తాన్ వలీ సమాధికి గంధ లేపనం చేశారు. అనంతరం గంధ లేపనాన్ని భక్తులకు పంపిణీ చేశారు.