నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మళ్లీ మొదలయ్యాయి. సాగర్ కుడికాలువ గేట్లను ఎత్తి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు చేపట్టిన యత్నాన్ని తెలంగాణ ఇంజనీర్లు తీవ్రంగా ప్రతిఘటించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేదా ఆదేశాలు లేకుండా గేట్లు ఎలా తెరుస్తారంటూ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.