భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో సూర్యాపేట, తాండూరు, సహా 12చోట్ల తనిఖీలు చేపట్టారు. భూపాలపల్లి, హైదరాబాద్లోని ఏడీ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.

