జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు దగ్గర విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు చనిపోయారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నారు.. ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారిని చిలకలూరిపేట మండంల వేలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వేలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.