జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్ధపల్లిలో గత మూడు రోజులుగా అదృశ్యమైన బీజేపీ నేత రమణ, ఆదివారం స్థానిక వరద ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా రమణ పని చేశారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ప్రమాదవశాత్తు కారు కాలువలో పడిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

