తెలంగాణలో ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. మొత్తంగా 68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తన సర్వే ఫలితాల్లో పేర్కొంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 36%, బీఆర్ఎస్ 29.7%, బీజేపీ 19.3% ఓట్లను సాధించవచ్చని సర్వే పేర్కొంది.

