ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూపై శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకున్న మాటలలో నూటికి నూరుశాతం నిజం ఉందన్నారు. రాహుల్ , బిట్టూ మధ్య జరిగింది చూస్తూ ఉంటే దేశంలో రాజకీయం ఏ మేరకు దిగజారిందనేది తెలియవస్తోందని శిరోమణి అకాలీదళ్ నేత దల్జీత్ సింగ్ చీమా స్పందించారు. రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి బిట్టూను ద్రోహి అని తిట్టారు. ప్రతిగా బిట్టూ రాహుల్ గాంధీని దేశ్ కీ దుష్మన్ అని దూషించారు.

