తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి రోజు 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో తొలి రోజు(బుధవారం) 99 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలతో పాటు నగరపాలక సంస్థలు 22 నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డిలో నాలుగు మున్సిపాలిటీలకు 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

